Home » సినిమాలో సరదాగా ఎన్టీఆర్ చెప్పిన మాట నిజం అయ్యింది గా ! ఇది గుర్తుందా ?

సినిమాలో సరదాగా ఎన్టీఆర్ చెప్పిన మాట నిజం అయ్యింది గా ! ఇది గుర్తుందా ?

by AJAY
Ad

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ లు వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా విగ్నేష్ శివన్ నయనతార ప్రేమలో ఉన్నారు. రీసెంట్ గా వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. జూన్ నెలలో వీరి పెళ్లి బంధువులు కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా నయన్ విగ్నేష్ లు తాము కవల పిల్లలకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Also Read: చిరంజీవి స‌హా ఆ ఇద్దరు స్టార్ లు బాలయ్య‌ను అందుకోలేక‌పోతున్నారా..?

Advertisement

నయనతార భర్త విగ్నేష్ శివన్ తమకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే నయనతారకు ఇద్దరు పిల్లలు పుడతారని దర్శకుడు వివి వినాయక్ ఎప్పుడో చెప్పాడు. అయితే వివి వినాయక్ నయనతారకు ఇద్దరు పిల్లలు పుడతారని చెప్పింది బయట కాదు సినిమాలో… ఎన్టీఆర్ హీరోగా నటించిన అదుర్స్ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించారు.

Advertisement

ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించగా నయనతార హీరోయిన్ గా నటించింది. అయితే సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అందులో చారి అనే పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక చారి అనే పాత్రతో నయనతారకు లవ్ ట్రాక్ ఉంటుంది. సినిమా ప్రారంభంలో చారి మొదటిసారి నయనతారను చూసినప్పుడు స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తూ ఉంటుంది.

Also Read: మళ్ళీ కొరటాల టార్గెట్ గా చిరంజీవి కామెంట్స్..!

ఆ సమయంలో నయనతార నడుముపై రెండు పుట్టుమచ్చలు ఉంటాయి. దాంతో పుట్టుమచ్చ చూసి చారి మీకు ఇద్దరు మగ కవల పిల్లలు పుడతారని చెబుతాడు. ఇక ఆ సినిమా ఎండింగ్ లో బ్రహ్మానందం ఇద్దరు కవల పిల్లలను ఎత్తుకుని కనిపిస్తాడు. అయితే ఇప్పుడు వివి. వినాయక్ సినిమాలో హీరో ఎన్టీఆర్ తో చెప్పించినట్టుగానే నయనతార నిజ జీవితంలోనూ జరిగింది. దాంతో అదుర్స్ సినిమాకు సంబంధించిన సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: చిరంజీవి కంటే ముందే గాడ్‌ఫాద‌ర్ టైటిల్‌తో సినిమా తీసిన హీరో ఎవ‌రో తెలుసా ?

Visitors Are Also Reading