Home » విడుదలకు ముందే నాని ‘దసరా’ ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్.. ఎందులో అంటే..?

విడుదలకు ముందే నాని ‘దసరా’ ఓటీటీ పార్ట్ నర్ ఫిక్స్.. ఎందులో అంటే..?

by Anji
Published: Last Updated on
Ad

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం దసరా. ఈ సినిమా సింగరేణి నేపథ్యంలో తెరకెక్కించబడుతోంది. ఈ ఏడాది మార్చి 30న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. నానికి జంటగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన లుక్ అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి. ప్రధానంగా ఈ చిత్రంలోని ధూమ్ ధామ్ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే దసరా సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతము ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. 

Advertisement

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెలా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. సముద్ర ఖని, సాయికుమార్, జరీనా వహబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంతోష్ నారాయణ సంగీతం అందించారు. ఇటీవల  కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నాని లుక్కు అందర్నీ ఆకట్టుకుంది. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

Advertisement

Also Read :   జురాసిక్ పార్కు దర్శకుడిని కలిసి జక్కన్న ఏమన్నాడో తెలుసా..?

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటి ప్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్   కైవసం చేసుకుంది. థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. తాజాగా ఈ విషయాన్ని సదరు ఓటిటీ సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగానే ప్రకటించింది. ఈ మేరకు దసరా పోస్టర్ను కూడా షేర్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత నాని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయనున్నారు. నాని 30వ సినిమాకు కూడా కొత్త దర్శకుడు శౌర్యం పరిచయమవుతున్నాడు. మృనాల్ ఠాకూర్ ఇందులో కథానాయక నటించిన ఉంది. ఇక మార్చి 30న వచ్చే దసరా చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి మరి. 

Also Read :   మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ వీళ్లే..!

Visitors Are Also Reading