Home » జురాసిక్ పార్కు దర్శకుడిని కలిసి జక్కన్న ఏమన్నాడో తెలుసా..?

జురాసిక్ పార్కు దర్శకుడిని కలిసి జక్కన్న ఏమన్నాడో తెలుసా..?

by Anji
Ad

సినీ దగ్గజం, హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్ బర్గ్ ని దర్శకధీరుడు రాజమౌళి కలిసారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా కుటుంబ సమేతంగా అమెరికాకి వెళ్లిన జక్కన్న. సంగీత దర్శకుడు కీరవాణి తాజాగా యూనివర్సల్ పార్టీకి హాజరయ్యారు. హాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్న వేడుకలో జక్కన్న, కీరవాణి సందడి చేసారు. ఇందులో భాగంగా వీరిద్దరూ మొదటిసారి స్పిల్ బర్గ్ ని కలిసి.. కాసేపు ముచ్చటించారు. 

Advertisement

ఇక స్పిల్ బర్గ్ తో కలిసి కలిసి దిగిన పలు ఫోటోలను రాజమౌళి ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ముఖ్యంగా “నేను దేవుడిని ఇప్పుడే కలిశాను” అంటూ తన ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. గాడ్ ఆఫ్ మూవీస్ గా అభివర్ణించే స్పిల్ బర్గ్ ని కలిసి.. ఆయన సినిమాలంటే నాకెంత ఇష్టమో చెప్పాను. నాటు నాటు ఎంతో నచ్చిందని ఆయన చెప్పిన మాటలను నేనింకా నమ్మలేకపోతున్నాను అని కీరవాణి రాసుకొచ్చారు. జురాసిక్ పార్క్, హుక్, ది టర్మినల్, దిపోస్ట్ వంటి గొప్ప చిత్రాలకు స్పిల్ బర్గ్ దర్శకత్వం వహించిన విషయం విధితమే. 

Advertisement

Also Read :  గుర్తు పట్టలేనంతగా మారిపోయిన కొత్త బంగారు లోకం హీరోయిన్…ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా….?

ఆస్కార్ ఓటింగ్ లో భాగంగా ఏస్ ఏంజెల్స్ లోని సన్ సెట్ టవర్స్ లో తాజాగా యూనివర్సల్ పార్టీ నిర్వహించారు. హాలీవుడ్ కి చెందిన స్టార్ సెలబ్రిటీలందరూ ఈ వేడుకలలో పాల్గొని సందడి చేసారు. ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు పాట ఆస్కార్ షార్ట్ లిస్ట్ కి ఎంపికైన విషయం తెలిసిందే. మరోవైపు.. భారత్ నుంచి 10 సినిమాలు ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన చిత్రాల అన్నింటికి ఓటింగ్ నిర్వహించి.. నామినేషన్స్ లో నిలిచిన చిత్రాలను ఈనెల 24న ప్రకటించనున్నారు. అదేవిధంగా మార్చి 12న అవార్డుల ప్రదానోత్సవం జరుగనున్నది. 

Also Read :  మూడో పెళ్లి పై స్పందించిన జయసుధ…ఆ వ్యక్తి ఎవరో కాదంటూ ఓపెన్ కామెంట్స్…!

 

Visitors Are Also Reading