Home » మల్టి స్టారర్ ఒకే అంటున్న చైతన్య.. కానీ అఖిల్ తో మాత్రం..?

మల్టి స్టారర్ ఒకే అంటున్న చైతన్య.. కానీ అఖిల్ తో మాత్రం..?

by Azhar
Ad

ఇప్పుడు మన టాలీవుడ్ లో మల్టి స్టారర్ ట్రెండ్ అనేది నడుస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు హీరోలు కలిసి ఒక్కే సినిమాలో నటించడం అనేది తెలుగులో పెద్ద మాటే. కానీ ఇప్పుడు ఎక్కువ మంది హీరోలు మల్టి స్టారర్ సినిమాలు చేయానికి ఒకే అంటున్నారు. దాంతో ఎప్పుడు మల్టి స్టారర్ సినిమా వచ్చిన కూడా ఫ్యాన్స్ తెగ చూసేస్తారు. అయితే మల్టి స్టారర్ లో కూడా ఒక్కే కుటుంబానికి చెందిన హీరోలు ఉంటె.. అసైనిమాకు ఉండే క్రేజ్ అనేది మాములుగా ఉండదు. ఇలా వచ్చిన సినిమాల్లో కథ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఫ్యాన్స్ సినిమాను ఆదరిస్తారు.

Advertisement

అయితే ఇలా ఒక్కే కుటుంబం యూక మూడు తరాల హీరోలతో వచ్చిన సినిమా మనం. ఇందులో అక్కినేని కుటుంబంలోని ముగ్గురు హీరోలు కనిపించరు. ఏఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య ముగ్గురు కూడా నటించారు. ఇక ఈ సినిమా స్టోరీ కూడా అందరికి నచ్చడంతో… ఇది సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ కూడా అలంటి సినిమా అక్కినేని ఫ్యామిలీ నుండి రావాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ముఖ్యంగా అఖిల్, చైతన్య సినిమా చేస్తే బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మనం సినిమా టైంకు అఖిల్ ఇంకా అరంగేట్రం చేయకపోవడంతో.. కేవలంలో చివర్లో ఓ చిన్న పాత్రలో కనిపిస్తాడు. అందుకే ఈ అన్నదమ్ములు ఇద్దరు కలిస్తే బాటుంది అని అంటున్నారు

Advertisement

ఇక ఇదే విషయంపై తాజాగా చైతన్య కూడా స్పందించాడు. ప్రస్తుతం థాంక్యూ సినిమా ప్రమోషన్‌ లో బిజీగా ఉన్న చైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మల్టి స్టారర్ సినిమాలు చేయడానికి నేను సిద్ధం. కానీ అఖిల్ తో సినిమా అంటేనే జాగ్రత్తగా ఉండాలి. స్పెషల్ కథతో ఫ్యాన్స్ ముందుకు రావాలి. అఖిల్ తో సినిమా చేయాలనీ నేను కూడా అనుకుంటున్నాను. కానీ మాకు కథ అంత ఈజీగా దొరకదు అని నేను అనుకుంటున్నాను అంటూ చైతన్య పేర్కొన్నాడు. చూడాలి మరి ఫ్యాన్స్ యొక్క ఈ కల అనేది ఎప్పుడు తిరుగుతుంది అనేది.

ఇవి కూడా చదవండి :

ధోని అభిమానిని కానీ.. ఇండియాకు కాదు అంటున్న పాక్ ప్లేయర్..!

మళ్ళీ బేసిక్స్ నుండి కోహ్లీ.. చిన్ననాటి కోచ్ అకాడమీకి పయనం…!

Visitors Are Also Reading