Home » నాపై ట్రోల్స్ చేస్తే..దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన మంచు లక్ష్మి !

నాపై ట్రోల్స్ చేస్తే..దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన మంచు లక్ష్మి !

by Bunty
Ad

మోహన్ బాబు నటవారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి మంచు లక్ష్మి విదేశాల్లో చదువుకున్న మంచు లక్ష్మి హాలీవుడ్ సీరియల్స్ లో కూడా నటించారు. ఆ తర్వాత తెలుగు సినిమాపై ఉన్న ఆసక్తితో తిరిగి హైదరాబాద్ కు వచ్చానని లక్ష్మీ అనేక సందర్భాలలో చెప్పారు. అనగనగా ఓ ధీరుడు సినిమాలో విలన్ గా నటించిన మంచు లక్ష్మి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాతోనే తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది.

READ ALSO : ఇంగ్లండ్‌ను వణికిస్తున్న పాక్ మిస్టరీ స్పిన్నర్! ఎవరీ అబ్రార్?

Advertisement

అంతేకాకుండా గుండెల్లో గోదారి సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేకపోయింది. కానీ మంచు లక్ష్మి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత పలు చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు చేస్తూ సినిమాలను కూడా నిర్మించారు. ఇదిలా ఉంటే, ట్రోల్స్ పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మంచు లక్ష్మి. ట్రోల్స్ విషయంలో తాను బాగా ఎంజాయ్ చేస్తాను అని చెబుతోంది మంచు లక్ష్మి.

Advertisement

తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, మీమ్స్ బాగా ఆస్వాదిస్తుంటారని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. తనపై, తన వాక్యాలపై సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు, మీమ్స్, ట్రోల్స్ ను చూస్తుంటానని వాటిలో కొన్ని భలే సరదాగా ఉంటాయని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. ఆమె మలయాళం లో నటించిన ‘మాన్ స్టార్’ సినిమా ప్రచారంలో భాగంగా మీడియా ముందుకు వచ్చి పై విధంగా మాట్లాడారు. దీంతో ఆమె అభిమానులు మంచు లక్ష్మి స్పోర్టివ్ నెస్ అది అంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. ట్రోలర్స్ అయితే థాంక్యూ అంటున్నారు. ఆ మధ్య వరుసగా సినిమాల్లో నటించిన మంచు లక్ష్మి ఇప్పుడు ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె గాంబ్లర్, లేచింది మహిళా లోకం, అగ్ని నక్షత్రం తదితర సినిమాల్లో నటిస్తున్నారు.

READ ALSO : పెళ్లి పీటలు ఎక్కనున్న జబర్దస్త్‌ పవిత్ర.. వరుడేవరంటే!

Visitors Are Also Reading