Home » రూ.50 నోటుపై అమిత్ షాకి ప్రేమ సందేశం..!

రూ.50 నోటుపై అమిత్ షాకి ప్రేమ సందేశం..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా చాలా మంది ప్రేమికులు ప్రేమికుల దినోత్సవం కోసం ఎదురు చూస్తూ.. తమ ప్రేయసి లేదా ప్రేమికుడిని ఎలా మెప్పించలా అని ఆలోచిస్తున్న సమయం ఇది. ఈ సమయం లో సోషల్‌ మీడియాలో  ఓ ప్రేమ లేఖ వైరల్‌ గా మారింది. ప్రేమలేఖ అంటే రంగురంగుల కాగితాల మీద ప్రేమికులు తమ భావాలను వ్యక్త పరుస్తూ ఎదుటి వారి ప్రేమను పొందేందుకు రాస్తుంటారు. కానీ ఇక్కడ వైరల్‌ అవుతున్న ప్రేమలేఖ మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే ఆ ప్రేమలేఖ రూ. 50 నోటు పై రాసి ఉంది కనుక. అది కూడా ఓ ప్రేమికురాలు తన ప్రియునికి రాసింది అనుకుంటే పొరపాటేనండోయ్.. !

Advertisement

Advertisement

ఓ యువతి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు రాసింది.   దీంతో ఆ నోటు లేఖ తెగ వైరల్‌గా మారింది. ఆ 50 రూపాయల నోటు పై ఓ యువతి  డియర్‌ అమిత్‌ జీ..  మే 29న నా పెళ్లి. కానీ మీరు నన్ను మీతో తీసుకుని వెళ్లండి అని రాసి ఉంది. అంతేకాదు.. పక్కన ఐ లవ్‌.. అని కూడా రాసింది. ఇది కాస్తా సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయింది. ఈ పోస్టు పెట్టిన కొద్ది నిమిషాల్లోనే 13 వేల మందికి పైగా దీనిని లైక్‌ చేశారు. ఈ వైరల్ పోస్ట్‌ ఫన్నీ-హిందీ- పోస్ట్‌ 0 అనే ఇన్‌ స్టా పేజీలో ఉంది. దీనిని చూసిన తరువాత నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేయడం విశేషం.

Visitors Are Also Reading