Home » దర్శకుడు మెహర్ రమేష్ వలన టాలీవుడ్ నిర్మాతలకు ఆరోజుల్లోనే అన్ని కోట్ల నష్టం వచ్చిందా?

దర్శకుడు మెహర్ రమేష్ వలన టాలీవుడ్ నిర్మాతలకు ఆరోజుల్లోనే అన్ని కోట్ల నష్టం వచ్చిందా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

తక్కువ టైం లోనే, తక్కువ సినిమాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా మెహర్ రమేష్ నిలిచారు. ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా.. వాటిల్లో డిజాస్టర్లే ఎక్కువ ఉన్నారు. టాప్ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించారు అన్న రికార్డు అయితే ఉంది. కానీ, వారికి ఆ సినిమాలు సక్సెస్ ని ఇవ్వలేకపోవడంతో మెహెర్ రమేష్ పై కామెంట్స్ గట్టిగానే వినిపిస్తూ ఉంటాయి. మరోవైపు నిర్మాతలకు కూడా ఆయన దర్శకత్వంలో సినిమా అంటే టెన్షన్ గానే ఉంటుంది.

Advertisement

గతంలో పూరి జగన్నాధ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన మెహర్ రమేష్ “బిల్లా” సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించారు. ఈ సినిమాలో ప్రభాస్ ను మెహర్ చాలా స్టైలిష్ గా చూపించారు. అయితే.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఫారిన్ లో జరుపుకోవడంతో బడ్జెట్ భారీగానే అయ్యింది. ఆ తరువాత ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు కంత్రి, శక్తీ, షాడో.. ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం తెచ్చుకోలేదు.

Advertisement

కంత్రి, శక్తీ సినిమాలలో ఎన్టీఆర్ హీరో గా నటిస్తే, షాడో సినిమాలో వెంకటేష్ హీరో గా నటించారు. ఆ హీరోలకు ఈ సినిమాలు డిజాస్టర్లుగానే మిగిలాయి. అప్పట్లోనే మెహర్ రమేష్ కారణంగా టాలీవుడ్ నిర్మాతలకు దాదాపు యాభై కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందట. ప్రస్తుతం మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్, తమన్నాలు నటిస్తున్నారు. ఈ సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకోవాలని మెహర్ గట్టి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాతో విమర్శలకు చెక్ పెట్టాలని మెహర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరిన్ని..

ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?

మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్

ధోని కుట్ర చేశాడు.. కావాలనే రన్ అవుట్ అయ్యాడు – యువరాజ్ తండ్రి సంచలనం

Visitors Are Also Reading