Home » కేజీఎఫ్- 2 న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్స్…అంద‌రికంటే ఎక్కువ పుచ్చుకుంది ఎవ‌రో తెలుసా..!

కేజీఎఫ్- 2 న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్స్…అంద‌రికంటే ఎక్కువ పుచ్చుకుంది ఎవ‌రో తెలుసా..!

by AJAY
Ad

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో య‌ష్ నటించిన సినిమా కేజిఎఫ్. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా కూడా ఇటీవల కేజీఎఫ్-2 ను కూడా విడుదల చేశారు.ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ సినిమాలో య‌ష్ ను ఢీకొట్టే పాత్రలో విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించారు. అంతేకాకుండా సినిమా లో ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటించారు. ఇక సినిమాలో య‌ష్ కు జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది.

Advertisement

అదేవిధంగా య‌ష్ కు తల్లిగా సినిమాలో మాళవిక అవినాష్ నటించారు. ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి నటులు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీ ని మరో మెట్టు ఎక్కించింది. ఈ సినిమా తో ప్రశాంత్ నీల్ కన్నడ సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేశారు. సినిమాలోని విజువల్స్ యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ఎలివేషన్ సీన్స్ ఒక్కొక్కటి ఒక్కో హైలైట్ గా నిలిచాయి.

Advertisement

ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సినిమాలో న‌టించిన నటీనటులు కూడా ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ పుచ్చుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం హీరో య‌ష్ ఏకంగా రూ.30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా దర్శకుడు ప్రశాంత్ నీల్ 15 కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.

అంతేకాకుండా విలన్ గా నటించిన సంజ‌య్ ద‌త్ రూ.9 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి రూ.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నార‌ట‌. అదేవిధంగా బాలీవుడ్ న‌టి రవీనా టాండన్ రూ. 1.5 కోట్లు తీసుకోగా ప్రకాష్ రాజ్ 80 ల‌క్ష‌లు, మాళవిక అవినాష్ 62 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 తర్వాత ప్రభాస్ హీరోగా స‌లార్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

ALSO READ :

ఎన్టీఆర్,పవన్, మహేష్ ల మీద వింత కామెంట్స్ చేసిన జగన్నాథ్..! జీరో అయినప్పుడు తోడుగా భార్య తప్ప .!

“ఒక్కడు” సినిమా కి హీరోగా మొదటి చాయిస్ మహేష్ కాదట ! మరెవరో తెలుసా ?

Visitors Are Also Reading