Home » కీర్తి సురేష్ బంగారం పంచడం వెనక ఇంత స్వార్థం ఉందా..?

కీర్తి సురేష్ బంగారం పంచడం వెనక ఇంత స్వార్థం ఉందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా మూవీ భారీ హిట్ అయితే ఆ సినిమా డైరెక్టర్లకి లేదా ప్రొడ్యూసర్లకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం మనం చూసాం. అంతేకాకుండా స్టార్ హీరోలు, లేదా హీరోయిన్లు, టెక్నీషియన్స్ ఇతర వర్కర్స్ కు గ్రాండ్ గా పార్టీలు ఇవ్వడం కామన్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ తంతు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. వీటన్నింటికి డిఫరెంట్ గా హీరోయిన్ కీర్తి సురేష్ చేసింది.. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం.. మహానటి సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్.

Advertisement

 

also read:వెంకటేష్ సరసన హీరోయిన్ గా పాన్ ఇండియా బ్యూటీ?

ప్రస్తుతం చాలా ప్రాజెక్టులలో చేస్తూ బిజీగా మారింది. కానీ ఆమె రీసెంట్ గా హీరో నానితో దసరా సినిమా చేస్తోంది. ఈ చిత్రం మార్చి 30వ తేదీన గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతోంది. ఇందులో డి గ్లామరస్ పాత్రలో కనిపించబోతున్న కీర్తి సురేష్ ఆమె వెర్షన్ షూటింగ్ పూర్తవగానే అదిరిపోయే మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. ఒకరిద్దరికి, కాదు దాదాపుగా 130 మందికి ఆమె బంగారు కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిందట. ఇది మార్కెట్ వేల్యూ ప్రకారం 17 లక్షల పైగానే ఉంటుందట. ఈ విధంగా ఆమె మంచితనాన్ని చూపించడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

ఈ క్రమంలోనే ఒక వార్త కూడా వినిపిస్తోంది.. ఆమె అలా సహకారం చేయడం వెనుక చిన్న స్వార్థం ఉందని కొంతమంది అంటున్నారు.. ఇంతకీ అది ఏంటయ్యా అంటే ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ కు సోషల్ మీడియాలో నెగిటివిటీ పెరిగిపోయింది. ఆ నెగిటివిటీని పాజిటివ్ గా మార్చుకోవాలంటే ఇలాంటి పనులతోనే సాధ్యం అంటూ కీర్తి సురేష్ డబ్బుల గురించి ఆలోచించకుండా చిత్ర బృందానికి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి బంగారు నాణాలు కొనిచ్చింది. దీంతో కీర్తి సురేష్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.

also read:

Visitors Are Also Reading