Home » సికింద్రాబాద్‌ నుంచి మోడీ పోటీ..బరిలో కేఏ పాల్‌ ?

సికింద్రాబాద్‌ నుంచి మోడీ పోటీ..బరిలో కేఏ పాల్‌ ?

by Bunty
Ad

 

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఎం నరేంద్ర మోడీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తారని అంటున్నారని…తెలుగు సత్తా చూపించేందుకు మోడీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు మోడీపై నేను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారoటిలకు నాది గ్యారెంటీ అని…నాలాంటి వాడికి పార్లమెంటు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు కేఏ పాల్‌.

ka paul Comments On Pm modi

నేను తప్ప ఎవరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చలేరన్నారు. వడ్డీలు కూడా కట్టలేదు…ఇతర సాకులతో గడిపేస్తారని ఫైర్‌ అయ్యారు. ప్రజాశాంతి పార్టీకి ఇక సింబల్ రానుంది..టిడిపి తరఫున ఎంపీగా పోటీ చేయాలనుకునే వాళ్లను 50 కోట్లు అడుగుతున్నారట అంటూ చురకలు అంటించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అప్పులు తీరాలంటే జనవరి 30న గ్లోబల్ సమ్మిట్ జరగాలని కోరారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్..

Advertisement

జెడి లక్ష్మీనారాయణ పార్టీ పెట్టేందుకు ఆర్ఎస్ఎస్ బిజెపిలు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా ప్రభుత్వంలోకి రావాలని మోడి , అమిత్ షాలు కోరారని వివరించారు. నేను వెళ్ళలేదని పేర్కొన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading