Home » టెస్ట్ కెప్టెన్ గా బుమ్రాను ప్రకటించిన బీసీసీఐ..!

టెస్ట్ కెప్టెన్ గా బుమ్రాను ప్రకటించిన బీసీసీఐ..!

by Azhar
Ad

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. టెస్ట్, వన్డే, టీ20 సిరీస్ ల కోసం ఈ నెల భారత జట్టు రోహిత్ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ కు వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత వార్మప్ మ్యాచ్ జరుగుతున్న మూడో రోజు రోహిత్ కు కరోనా వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. అందువల్ల రేపటి నుండి ఇంగ్లాండ్ తో ప్రారంభం కానున్న టెస్ట్ మ్యాచ్ కు రోహి అందుబాటులో ఉండటం లేదు అనేది క్లారిటీ వచ్చింది. కానీ అతని స్థానంలో కెప్టెన్ ఎవరు అనేది మాత్రం తాజాగా బీసీసీఐ ప్రకటించింది.

Advertisement

ఈరోజు బీసీసీఐ తన ట్విట్టర్ వేదికగా… రోహిత్ శర్మ స్థానంలో ఈ టెస్ట్ మ్యాచ్ కు భారత పేసర్ బుమ్రా కెప్టెన్సీ చేయబోతున్నాడు అని ప్రకటించింది. ఇక అలాగే వైస్ కెప్టెన్ గా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు అవకాశం కలిపించింది. దాంతో గత మూడు రోజులుగా జరుగుతున్న ఓ చర్చకు తెర పడినట్లు అవుతుంది. అయితే అభిమానులు అందరూ ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేయాలనుకున్నారు. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్గత ఏడాది కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన సిరీస్ లో వాయిదా పడినదే. కానీ బీసీసీఐ కోహ్లీకి అవకాశం ఇవ్వలేదా.. లేక బీసీసీఐ అడిగిన కోహ్లీ ఒప్పుకోలేదా అనేది తెలియదు.

Advertisement

అయితే గత ఏడాది జరిగిన నాలుగు మ్యాచ్ లలో టీం ఇండియా 2-1 తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ సిరీస్ ఇండియాదే అనుకున్న సమయంలో భారత కోచింగ్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ మ్యాచ్ వాయిదా పది ఇప్పుడు జరుగుతుంది. కానీ ఇప్పుడు కూడా ఈ మ్యాచ్ ను కరోనా వెంటాడుతుంది అనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ కు బుమ్రా కెప్టెన్సీ చేస్తాడు అని క్లారిటీ వచ్చిన.. రోహిత్ స్థానంలో ఓపెనర్ గా ఎవరు రానున్నారు అనేది చూడాలి. అయితే ఈ స్థానంలో మయాంక్ అగర్వాల్ లేదా తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ ఇక మళ్ళీ ఎప్పటికి కెప్టెన్ కాడు..!

బీసీసీఐని లెక్క చెయ్యని టీం ఇండియా.. విచ్చలవిడిగా..?

Visitors Are Also Reading