Home » తన టీమ్ ని మార్చే ఆలోచనలో జక్కన్న.. మహేష్ బాబు మూవీతోనే మొదలు..!

తన టీమ్ ని మార్చే ఆలోచనలో జక్కన్న.. మహేష్ బాబు మూవీతోనే మొదలు..!

by Anji
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీని బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు రాజమౌళి. ఇక RRR మూవీతో భారతీయ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లి కూర్చొబెట్టిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని రాజమౌళి తెలుగు సినిమాల స్థాయిని పెంచి తెలుగు వాళ్లకి ఎంతో ఖ్యాతిని తీసుకొచ్చారు. అలాంటి జక్కన్న ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు. RRR లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత రాజమౌళి ఎవ్వరినీ డైరెక్ట్ చేస్తాడు అని ఇండియన్ మూవీ మొత్తం ఎదురు చూసింది.

Advertisement

కొంత మంది అయితే రాజమౌళి తన తదుపరి మూవీగా RRR  పార్ట్ 2 ని డైరెక్ట్ చేస్తాడనుకున్నారు. కానీ రామ్ చరణ్ అటు గేమ్ ఛేంజర్ తో.. ఇటు ఎన్టీఆర్ దేవర సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ రూమర్స్ కి చెక్ పడింది. వెంటనే రాజమౌళి కూడా ఆలస్యం చేయకుండా తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నట్టు ప్రకటించాడు కూడా. ఈ సినిమా ఇంకా అధికారికంగా ప్రారంభం అవ్వకుండానే అందరిలో అంచనాలు పెంచేశాయి. అందరి అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి కూడా ఈ మూవీ రూపొందించే పనిలో పడ్డారు అనిపిస్తుంది. ఇప్పటివరకు రాజమౌళి సినిమాలు అన్నింటికీ సెంథిల్ కుమార్ కెమెరామేన్ గా వ్యవహరించారు. కానీ మొట్టమొదటి సారి రాజమౌళి సెంథిల్ కుమార్ ని కాదనుకొని పీ.ఎస్.వినోద్ ని కెమెరామేన్ గా తీసుకోవాలనుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

Advertisement

కేవలం కెమెరామెన్ గానే కాకుండా సినిమాకి పని చేసే ముఖ్యమైన వ్యక్తులను కూడా రాజమౌళి మార్చాలని ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరికొందరూ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కూడా మహేష్ బాబు సినిమాకి పని చేస్తారా లేదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కూర్చొని కథకు తుది మెరుగులు దిద్దుతున్నారని తెలుస్తోంది. 2024లో ప్రారంభమయ్యే ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో పాటు యావత్ భారతదేశ వ్యాప్తంగా దర్శక ధీరుడి అభిమానులు ఎదురుచూస్తున్నారు.  

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి.     తెలుగు న్యూస్ కోసం వీటిని వీక్షించండి.

Visitors Are Also Reading