Home » ముగ్గురు మొన‌గాళ్లు సినిమాలో చిరంజీవికి డూప్ గా న‌టించింది ఎవ‌రో తెలుసా..?

ముగ్గురు మొన‌గాళ్లు సినిమాలో చిరంజీవికి డూప్ గా న‌టించింది ఎవ‌రో తెలుసా..?

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి ఫుట్ స్వింగ్ మీద ఉన్నారు. ఇప్ప‌టికే ఖైదీ నంబ‌ర్ 150, సైరా న‌ర‌సింహారెడ్డి, ఆచార్య సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ప్ర‌స్తుతం చిరు గాఢ్ ఫాద‌ర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు ప‌లువురు యంగ్ డైరెక్ట‌ర్ ల‌తో చిరంజీవి సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. త్వ‌ర‌లోనే చిరంజీవి బాబి కాంబినేష‌న్ లో ఓ సినిమా రానుంది.

Advertisement

చిరంజీవి వాల్తేర్ వీర‌య్య అనే మ‌రో చిత్రంలోనూ న‌టిస్తున్నాడు. ఈ సినిమా పై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా మెగాస్టార్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. త‌న న‌ట‌న డ్యాన్స్ లో గ్రేస్ తో చిరంజీవి ఎక్కువ మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. కాగా చిరు సినీ కెరీర్ లో ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు ఉన్నాయి.

Advertisement

మెగాస్టార్ కెరీర్ లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో ముగ్గురు మొన‌గాళ్లు సినిమా ఒక‌టి. ఈ సినిమాలో మెగాస్టార్ త్రిబుల్ యాక్ష‌న్ చేయాలి కాబట్టి ఆ క్యారెక్ట‌ర్ ల‌లో న‌టించ‌డానిడి డూప్ ల అవ‌స‌రం పడింది. దాంతో ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు ఆ పాత్ర‌ల్లో న‌టించే న‌టుల కోసం తెగ ప్ర‌య‌త్నం చేసాడు. అనంత‌రం అచ్చం మెగాస్టార్ లా క‌నిపించే ఇద్ద‌రిని పట్టుకున్నాడు.

ఆ ఇద్ద‌రిలో ఒక‌రు చిరంజీవి పీఏ సుబ్బారావు కాగా మ‌రొక‌రు ప్ర‌సాద్ రావు. ఈ ఇద్ద‌రూ కూడా చిరంజీవికి స‌రిపోయే హైట్ ఉండ‌టం తో పాటూ బాడీ లాంగ్వేజ్ కూడా చిరంజీవి మాదిరిగానే ఉండేది. దాంతో వీరినే రాఘ‌వేంద్ర‌రావు ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి స్వామి, పృథ్వీ, ద‌త్తాత్రేయ అనే మూడు పాత్ర‌ల్లో న‌టించారు. ఇక డూప్ లు స‌రిగ్గా సెట్ అవ్వ‌డంతో ఎక్క‌డా తేడా రాకుండా సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమా త‌ర‌వాత వీరిద్ద‌రూ చాలా సినిమాల‌లో చిరంజీకి డూప్ లుగా న‌టించారు.

Visitors Are Also Reading