Home » ఇంద్రవెళ్లి స్థూపాన్ని‌ అపవిత్రం చేశారు.. పాలాభిషేకం చేసిన తుడుందెబ్బ

ఇంద్రవెళ్లి స్థూపాన్ని‌ అపవిత్రం చేశారు.. పాలాభిషేకం చేసిన తుడుందెబ్బ

by Anji
Ad

కాంగ్రెస్ పునర్నిర్మాణ సభ పేరిట.. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న ఇంద్రవెళ్లి సభ వివాదాస్పదమైంది. ఆదివాసీల సంప్రదాయాలు అసలే తెలియని కొందరు వ్యక్తులు.. ఇంద్రవెళ్లి అమరవీరుల స్తూపాన్ని కాళ్లకు చెప్పులతో , బూట్లతో ఎక్కి అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది తుడుందెబ్బ. మరొసారి ఇలాంటివి రిపీట్ అయితే కఠి‌న చర్యలుంటాయంటూ హెచ్చరించింది.

Advertisement

అధికారులు సైతం ఆదివాసీ సంప్రదాయాలకు, నమ్మకాలకు గౌరవం ఇవ్వకుండా బూట్లతో ఇంద్రవెళ్లి స్తూపాన్ని తాకి అపవిత్రం చేశారని.. బూట్లతో ఇంద్రవెళ్లి అమరవీరుల స్తూపం‌ వద్దకు రావడమే నిషేధం అని.. అలాంటిది ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఇంద్రవెళ్లి స్తూపాన్ని అగౌరవ పరిచారంటూ మండి పడింది తుడుందెబ్బ. పాలతో స్తూపాన్ని శుద్ది చేసి పూజ కార్యక్రమాలను నిర్వహించింది. ప్రభుత్వమైన , అదికారులైనా చివరికి ప్రతిపక్ష నేతలైనా ఆదివాసీ సంప్రదాయాలను పాటించకుండా పవిత్రమైన ఇంద్రవెళ్లి అమర వీరుల స్తూపానికి గౌరవం ఇవ్వకుండా ఇష్ఠారీతిన వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరించింది.

Advertisement

 

తుడుందెబ్బ నాయకుడు పుర్క బాపురావు మాట్లాడుతూ ‘ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద నిన్న కొంతమంది నాయకులు చెప్పులతో, బూట్లతో స్తూపం వద్ద మెట్లెక్కి అపవిత్రం చేశారు. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. కనీస గౌరవం‌ ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరించడన్ని తుడుందెబ్బ తీవ్రంగా ఖండిస్తుంది. ఇంద్రవెళ్లి‌ అమరవీరుల స్తూపం వద్ద స్మృతి‌వనం శంకుస్థాపన పేరిట ప్రభుత్వ అదికారులు అతిగా ప్రవర్తించారు.. సీఎం వచ్చిన సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలు, అధికారులు, పోలీస్ అదికారులు‌ బూట్లతో స్తూపం పైకి వచ్చి అపవిత్రం చేశారు. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకూడదు’ అనిహెచ్చరించారు. అమరవీరుల ఆత్మస్థలిని అపవిత్ర చేసినందుకు పాలతో స్తూపాన్ని.. ఇంద్రవెళ్లి‌ స్మృతి‌వన ఆవణరాన్ని శుద్ధి చేశామని తెలిపారు.

Visitors Are Also Reading