Home » నేను ప్రపంచపు ఎనిమిదో వింత.. కే.ఏ.పాల్ కామెంట్స్ వైరల్..!

నేను ప్రపంచపు ఎనిమిదో వింత.. కే.ఏ.పాల్ కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి హీట్ మీద ఉన్నాయి. అధికార, ప్రతిపక్షాలు తోట పోటీగా విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో జనాలకు ఎంటర్ టైన్ మెంట్ కరువు అయింది. దానిని భర్తీ చేసే పనిని కే.ఏ.పాల్ ప్రారంభించారు. ఇటీవలే తెలంగాణ ఎన్నికల్లో ఆడపదడపా కే.ఏ.పాల్ మెరిశారు. అవి జనాలకు ఆ స్థాయిలో వినోదాన్ని పంచలేకపోయారు. అప్పట్లో మునుగోడు ఎన్నికల్లో పాల్ చూపించిన హాస్య చతురత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రదర్శించలేకపోయారు.  ఆ లోటును ఏపీ ఎన్నికల ద్వారా తీర్చుతున్నారు. తన మాటలతో, హావ భావాలతో రక్తి కట్టిస్తున్నారు. నవ్వులు తెప్పిస్తున్నారు. ఆకాశానికి, సముద్రానికి లంకె వేసినట్టు ఆయన మాట్లాడిన మాటలు మామూలుగా లేవు. ముఖ్యంగా శనివారం పాల్ చేసిన వ్యాఖ్యలు న భూతో నా భవిష్యత్.

Advertisement

Advertisement

ప్రతీసారి తన గురించి తాను గొప్పగా చెప్పుకునే పాల్..  అంతకుమించి అనే స్థాయిలో చెప్పుకున్నారు. ఎదుటివారికి ప్రశంసించే అవకాశాన్ని ఇవ్వకుండా ఆయనకు ఆయనే ప్రశంసించుకున్నారు. దైవంశ సంభూతుడిగా కీర్తించుకున్నారు.  తాను అపర మేధావినని చెప్పుకున్నారు.. బ్రాహ్మండాలను బద్దలు చేయగల శక్తి సంపన్నుడినని గొప్పలు పోయారు. ‘నేను హైకోర్టులో పిటిషన్ వేయడం వల్లే రాష్ట్రంలో మే నెలలో ఎన్నికలు జరుపుతున్నారు. నేను ప్రపంచంలో ఎనిమిదో వింతను. ఎవరి వద్దా బోయింగ్ 747 విమానం లేనప్పుడు నేను సాధించా. లక్షల మంది అనాధలను పోషించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎందుకు అమ్ముతున్నారని నేను ప్రశ్నిస్తేనే అది ఆగింది. ఎన్నికలు కూడా ఏప్రిల్ నెలలో జరగకుండా ఆపానని” పాల్ వ్యాఖ్యానించడంతో ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారు.

 

సీరియస్ రాజకీయాల నుంచి కాస్త ఉపశమనం లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కేఏ పాల్ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. నిజానికి అతడు మంచి వక్త. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతడు ప్రసంగిస్తే లక్షల మంది వినేవారు. కానీ కాలం కలిసి రాకపోవడంతో ఆయన ఒక జోకర్ లాగా మారిపోయారు. రాజకీయాలలో కామెడీ పీస్ గా అయిపోయారు. సోషల్ మీడియా వల్ల పాల్ కామెడీని జనం ఆస్వాదిస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలను ఆనందిస్తున్నారు. ఒకవేళ ఈ సోషల్ మీడియా లేకుంటే జనం పాల్ ను మిస్సయ్యే వారు. ఆయన కామెడీని కోల్పోయేవారు. ప్రపంచపు ఎనిమిదవ వింతగా ఉన్న పాల్ ఎంతైనా అభినందనీయుడు.

Also Read :  పల్లవి ప్రశాంత్ చేసిన పనికి నెటిజన్స్ షాక్.. ఏం చేశాడంటే..?

 

Visitors Are Also Reading