ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ సక్సెస్ పుల్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎంతటి సంచలన విజయం సాధించింతో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన ఫలితంతో దీనికి బూస్టింగ్ ఇచ్చేందుకు సుకుమార్ దీనికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. అంతకు మించి అన్నట్టుగా చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. గ్రాండ్ గా పుష్ప2 మూవీని ప్లాన్ చేస్తున్న సుకుమార్.. సర్వ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉండటానే ఈ మూవీకి భారీ ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement
పలు బడా సంస్థలు వందలాది కోట్లు ఆఫర్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ రేంజ్ ఏంటనేది మరోసారి స్పష్టం అవుతోంది. పుష్ప అల్లుఅర్జున్, రష్మిక మందన్న పాన్ ఇండియా క్రేజ్ కొట్టేశారు. బన్నీ మాస్ లుక్ కి తోడు రష్మిక మందన్న స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసింది. తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ గురించిన అప్ డేట్ బయటికొచ్చింది. ఆడియో రైట్స్ కి భారీ డిమాండ్ ఉండటంతో రూ.65 కోట్లకు విక్రయించారు. భారత సినీ చరిత్రలోనే ఇది కనీవిని ఎరుగని సరికొత్త చరిత్ర అనే చెప్పాలి. పుష్ప రాజ్ రికార్డుల వేట షురు అయిందని కామెంట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు.
Advertisement
పుష్ప ఫస్ట్ పార్ట్ తో అల్లు అర్జున్, రష్మిక మందన్న పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. బీటౌన్ లో కూడా పాపులర్ అయ్యారు. బన్నీ మాస్ లుక్ కి తోడు రష్మిక మందన్న శ్రీవల్లి పాత్ర నార్త్ లో కూడా క్రేజ్ రెట్టింపు చేసింది. అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీని 2024లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. శ్రీవల్లి పాత్ర ఇందులో తక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Also Read : బట్టలు లేకుండా మంచు లక్ష్మి… నెటిజన్లు సీరియస్!