Home » మాదాపూర్ కుమారి ఆంటీ కిచెన్‌కి ఎందుకు అంత క్రేజ్..?

మాదాపూర్ కుమారి ఆంటీ కిచెన్‌కి ఎందుకు అంత క్రేజ్..?

by Sravya
Ad

ఈరోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఫేమస్ అయిపోతున్నారు కొద్దిగా ట్రై చేస్తే చాలు భారీ పాపులారిటీని తెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది వ్యాపారాలు కూడా ట్రెండుకి తగ్గట్టుగా చేస్తున్నారు. బిజినెస్ బాగా జరగడానికి సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా కస్టమర్ల సంఖ్యని పెంచుకుంటున్నారు. అలా బాగా సక్సెస్ అయిన వాళ్లలో మాదాపూర్ కుమారి ఆంటీ ఫుడ్ కూడా ఒకటి. హైదరాబాద్ మహానగరంలో ఈమె చాలా ఫేమస్ అయిపోయింది దీనికి కారణం ఆమె కస్టమర్లకు అందిస్తున్న రుచికరమైన ఆహారం. మంచి రుచికరమైన వంటకాలతో నోరూరించే కుమారి చేతి వంట కోసం చాలా దూరాల నుండి వస్తూ ఉంటారు.

Advertisement

Advertisement

వంటకాల రుచి మాత్రమే కాదు కుమారి ఆంటీ ఆదాయం కూడా అందరికీ షాక్ అయ్యేలా చేస్తుంది. నెలకి దాదాపు మూడు లక్షల కి పైగా ఆమె సంపాదిస్తుంది వంట చేసే విధానంలో కుమారికి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే.. ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, బోటి కర్రీ, తలకాయ కూర ఇలా నాన్ వెజ్ ప్రియులకు ఆమె వంట చేసి నోరు ఊరిస్తుంది. కుమారి ఆంటీ రోజుకి 100 కిలోల చికెన్ వండుతుంది. తన దగ్గర ఏ రోజైనా 100 కిలోల చికెన్ కర్రీ వ్యాపారం తప్పక జరుగుతుందట. 10 కిలోల చొప్పున మటన్ వండుతుందట. పండగ రోజుల్లో కూడా ఆమెకి వ్యాపారానికి డిమాండ్ తగ్గదట. 100 కిలోల చికెన్ మూడు గంటల్లోనే అమ్ముడవుతుందట ఆమె ఫుడ్ వీడియోలని ఇప్పటివరకు ఆమె చూసుకోలేదు అని ఆమె చెప్పారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading