టాలీవుడ్ అగ్ర దర్శకుడు గుణశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. గుణశేఖర్ ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు తీసి టాలీవుడ్ అభిమానులు గుండెల్లో నిలిచిపోయాడు. రుద్రమదేవి సినిమా తరువాత దాదాపు ఐదేళ్ల గ్యాప్ తరువాత శాకుంతలం సినిమా తెరకెక్కుతుంది. తాజాగా గుణశేఖర్ తన కూతురు ఎంగేజ్ మెంట్ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘నా జీవిత ప్రయాణం మొదలైంది’ అంటూ తన ఎంగేజ్ మెంట్ ఫోటోలను షేర్ చేసింది.
Also Read : ఉదయ్ కిరణ్ తరుణ్ కాంబోలో ఓ మల్టీ స్టారర్ మిస్ అయ్యిందని తెలుసా..? ఎవరివల్ల మిస్ అయ్యిందంటే..?
Advertisement
ఆ తరువాత కూతురు నీలిమ సైతం తనకు కాబోయే భర్త ను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె నీలిమ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు.. తాజాగా హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో కాబోయే వరుడు రవి ప్రక్యాతో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
Advertisement
Also Read : హీరోయిన్ లేకుండానే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన హీరోలు…ఆ సినిమాలు ఎవంటే….?
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్, రుద్రమదేవి తదితర సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ గుణశేఖర్. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నారు. ఇక నీలిమ విషయానికొస్తే సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆమె కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచింది. అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి చిత్రానికి ఆమె సహ నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం శాకుంతలం చిత్రానికి నిర్మాత గా పనిచేస్తోంది నీలిమ. ఇందులో సమంత ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 4న తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
Also Read : బాలకృష్ణ-శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ఈ సినిమా గురించి మీకు తెలుసా ?