Home » తన కోసమైనా సరే కోహ్లీ ఆడాలి అంటున్న దాదా..!

తన కోసమైనా సరే కోహ్లీ ఆడాలి అంటున్న దాదా..!

by Azhar
Ad
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న సిరప్ గంగూలీ కోహ్లీ విషయంలో ఆసక్తికర కామెంట్స్ అనేవి చేసాడు. కోహ్లీ తనకోసమైన ఆడాలి అని అంటూ పేర్కొన్నాడు. అయితే విరాట్ కోహ్లీ మూడేళ్ళుగా సెంచరీ చేయకుండా.. ఏడాది పాటుగా తన ఫామ్ ను కోల్పోయి కూడా ఇంకా జట్టులో కొనసాగుతున్నాడు అంటే అతను గతంలో నెలకొల్పోయిన రికార్డులు.. చేసిన పరుగులు అనే చెప్పాలి.
కానీ ఎంత గొప్ప ఆటగాడు అయిన పరుగులు చేయకుండా ఉంటె ఎక్కువ రోజులు జట్టులో ఉండటం కష్టం. అయితే ఇదే విషయంపై దాదా మాట్లాడుతూ.. కోహ్లీ పరుగులు చేయాలనీ నేను కోరుకుంటున్నాను. దేశం కోసం కాకుండా ఇప్పుడు తన కోసం కోహ్లీ పురుగులు చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది అని గంగూలీ అన్నాడు. అంటే ఇందులో పరుగులు చేయకపోతే కోహ్లీకి జట్టులో చోటు కష్టమే అని దాదా హిన్ట్ ఇచ్చాడు.
అలాగే ఈ సీజన్ లో కోహ్లీ తప్పకుండ రాణిస్తాడు అని నేను కోరుకుంటున్నాను. ఈ టోర్నీ అతని కెరియర్ లోనే గొప్ప టోర్నీగా మిగిలిపోతుంది. అయితే మిగితా ప్రజలలాగే నేను కూడా కోహ్లీ చేస్తే బాగుండు అనుకుంటున్నాను. కానీ టీ20 ఫార్మాట్ లో సెంచరీ అనేది కష్టం అని దాదా చెప్పాడు. అలాగే రేపు పాకిస్థాన్ తో తలపడే భారత జట్టుకు ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలుసు అని దాదా చెప్పుకొచ్చాడు.

Advertisement

Visitors Are Also Reading