Home » పాకిస్థాన్ పై కోహ్లీ సాధించిన ఘతన మీకు తెలుసా..?

పాకిస్థాన్ పై కోహ్లీ సాధించిన ఘతన మీకు తెలుసా..?

by Azhar
Ad
ఇండియా, పాకిస్థాన్ జట్లు రేపు ఆసియా కప్ వేదికగా తలపడబోతున్నాయి అనే విషయం రెండు దేశాల లో ప్రతి ఒక్క అభిమానికి తెలుసు. ఎందుకంటే ఈ మ్యాచ్ కు ఉంటె హైప్ పబ్లిసిటీ అనేది అలా ఉంటుంది. అయితే ఈ రెండు దేశాలు ఇప్పుడు ద్వైపాక్షిక సిరీస్ లలో తలపడటం లేదు. అందుకే ఇలా ఐసీసీ, ఆసియా టోర్నీలలో తలపడిన సమయంలో చూసి ఆనందిస్తున్నారు అభిమానులు.
అయితే ఈ రెండు దేశాలు చివరిసారి పాల్గొన్నప్పుడు ఇండియాను 10 వికెట్ల తేడాతో ఓడించింది పాకిస్థాన్. దాంతో ఈసారి పాక్ ను ఎలాగైనా ఇండియా ఓడించాలని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇండియా మ్యాచ్ గెలవాలంటే కోహ్లీ పరుగులు చేయడం అనేది చాలా కీలకం అనేది అంరికి తెలుసు. కానీ గత ఏడాది కాలంగా కోహ్లీ ఫామ్ లో లేడు. అందుకే ఇప్పుడు కోహ్లీ ఎలా ఆడుతాడు అని అందరూ అనుకుంటున్నారు.
విరాట్ కోహ్లీ ఫామ్ తో సంబంధం లేకుండా పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే చెలరేగిపోతాడు అని అతని ఘతనలు చెబుతున్నాయి. కోహ్లీ జట్టులోకి వచ్చిన తర్వాత ఇండియా, పాక్ 9 టీ20 మ్యాచ్ లలో పాల్గొన్నాయి. అయితే ఆ 9 మ్యాచ్ లలో 5 మ్యాచ్ ల్లో కోహ్లీనే భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన వాడిగా నిలిచాడు. అయితే ఈ 9 మ్యాచ్ లలో కోహ్లీ 7 సార్లే బ్యాటింగ్ మాత్రమే చేసాడు.

Advertisement

Visitors Are Also Reading