Home » కోహ్లీ సెంచరీ చేయాలంటున్న పాక్ వైస్ కెప్టెన్..!

కోహ్లీ సెంచరీ చేయాలంటున్న పాక్ వైస్ కెప్టెన్..!

by Azhar
Published: Last Updated on
Ad
భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చెయ్యక 1000 రోజులు దాటిపోయింది అనే విషయం అందరికి తెలిసిందే. ఎప్పుడో 2019 లో బంగ్లాదేశ్ పైన టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన విరాట్.. అప్పటి నుండి తన లయన్ అనేది కోల్పోయాడు. ఇంకా ఒక్క ఏడాది నుండి పూర్తిగా పరుగులు చేయడం మరిచిపొయ్యినట్లు బ్యాటింగ్ అనేది చేస్తూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ.
అయితే విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలి అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అలాగే వేరే జట్ల ఆటగాడు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్థాన్ జట్టు యొక్క వైస్ కెప్టెన్ నోటి నుండి కూడా ఇదే మాట అనేది వచ్చింది. అయితే  ఇండియా, పాకిస్థాన్ ఆసియా కప్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు ముందు పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ మీడియా ముందు రాగ.. అతడికి కోహ్లీ గురించి ప్రశ్న ఎదురైంది.
ఇక దానికి సమాధానం ఇచ్చిన షాదాబ్ ఖాన్.. కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న గొప్ప ఆటగాళ్లలో ఒక్కడు అనేది నిజం. అయితే ప్రతి ఆటగాడు ఎపుడో ఒక్కసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాడు. కోహ్లీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే ఉన్నాడు. అయితే ఒక్క అభిమానిగా విరాట్ కోహ్లీ ఈ ఆసియా కప్ లో తన సెంచరీ అనేది చేయాలనీ నేను కోరుకుంటున్నాను. కానీ మా పాకిస్థాన్ కు వ్యతిరేకంగా చేయకూడదు అని నేను ప్రార్ధిస్తున్నాను అని చెప్పాడు.

Advertisement

Visitors Are Also Reading