Home » కెప్టెన్ కూల్ పై ఫ్యాన్స్ ఫైర్..!

కెప్టెన్ కూల్ పై ఫ్యాన్స్ ఫైర్..!

by Azhar
Ad

మహేంద్ర సింగ్ ధోని.. భారత జట్టుకు నాయకత్వం వహించిన వారిలో ఓ గొప్ప కెప్టెన్ అనే విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. అందుకు నిదర్శనం ప్రపంచంలో క్రికెట్ జట్టు కెప్టెన్ సాధించలేని రికార్డు.. ఐసీసీ యొక్క మూడు టైటిల్స్ అందుకున్న ఏకైక కెప్టెన్ గా నిలవడం. అయితే ధోని ఆట పరంగా ఎంత గొప్పవాడు అయిన సరే.. వ్యక్తిగతంగా మాత్రం ధోని పైన విమర్శలు అనేవి వచ్చిన ఘటనలు చాలా ఉన్నాయి.

Advertisement

ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతున్న సమయంలో ఎంతో మంది సెలబ్రెటీలు.. ఎంతో సాయం చేసారు. కానీ ధోని మాత్రం చేయలేదు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు కమర్షియల్ పోస్టులు తప్ప.. బయట ప్రపంచానికి సంబంధించిన ఒక్క పోస్ కూడా ధోని చేయడు. అలంటి ధోని నిన్న అణుయంగా రేపు నిను లైవ్ కు వస్తున్నాను అని ప్రకటించడంతో ధోని ఏం చెబుతాడో అని అందరూ అనుకున్నారు.

Advertisement

ఒక్కవేల ధోని రిటైర్మెంట్ కు సంబంధించిన ఏదైనా విషయం చెబుతాడు కావచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ లైవ్ ద్వారా ధోని ఫ్యాన్స్ నోట్లో బిస్కెట్ పెట్టాడు అనే చెప్పాలి. ఓ బిస్కెట్ ను ప్రమోట్ చేయడనికి ధోని ఈ లైవ్ అనేది ఏర్పాటు చేసాడు. దాంతో ఈ కెప్టెన్ కూల్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాను కేవలం కమెర్షియల్ కే వాడకుండా.. ఇలాంటి హైప్స్ అనేవి ఇవ్వకుండా ఉంటె మంచింది ధోని అని సూచనలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐ ఎన్నికల ప్రకటన వచ్చేసింది..!

మరోసారి పరువు తీసుకున్న బ్రాడ్..!

Visitors Are Also Reading