Home » రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ‌త్త పాత్ర‌ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా.? ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..?

రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ‌త్త పాత్ర‌ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా.? ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..?

by AJAY

సినిమా అంటే మొద‌ట అనుకున్న‌దానికి చివ‌రికి షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లైన నాటికి చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. టెక్నీషియ‌న్ లు న‌టీన‌టులు ఇలా ఎవ‌రైనా మారిపోవ‌చ్చు. మొద‌ట అనుకున్న న‌టీన‌టులు ఓకే చెప్ప‌క‌పోతేనో ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో వారి స్థానంలో వేరేవాళ్ల‌ను కూడా తీసుకుంటారు.

ఇక రంగ‌స్థ‌లం సినిమాలోనూ అలానే జ‌రిగింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ హీరోగా రంగ‌స్థ‌లం సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో స‌మంత హీరోయిన్ గా న‌టించింది. విలేజ్ పొలిటిక‌ల్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇక ఈ సినిమాలోని ముఖ్య‌మైన పాత్ర‌ల‌లో రంగ‌మ్మ‌త్త పాత్ర కూడా ఒక‌టి.

ఈ పాత్ర‌లో అనసూయ న‌టించి మెప్పించింది. హీరోకు చాలా ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర ఇది. సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అత్తా అత్తా అంటూ ఆమె వెంట‌నే తిరుగుతుంటాడు. దాంతో ఈ పాత్ర‌కు సినిమాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అయితే నిజానికి ఈ పాత్ర‌ను అన‌సూయ కోసం అనుకోల‌ద‌ట‌.

మొద‌ట ఈ పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ రాశిని అనుకున్నారు. కానీ రాశి పాత్ర కాస్త బోల్డ్ గా ఉండ‌టంతో నో చెప్పింద‌ట‌. దాంతో ఈ అవ‌కాశం అన‌సూయ వ‌ద్ద‌కు వెళ్లింది. ఇక అన‌సూయ ఆ పాత్ర‌లో జీవించేసింది. త‌న న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమా త‌ర‌వాత అన‌సూయ వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకుంది.

Visitors Are Also Reading