Home » శర్వానంద్ ఎంగేజ్మెంట్ అయి ఇన్ని నెలలైనా పెళ్లి ఎందుకు కావట్లేదో తెలుసా..?

శర్వానంద్ ఎంగేజ్మెంట్ అయి ఇన్ని నెలలైనా పెళ్లి ఎందుకు కావట్లేదో తెలుసా..?

Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి పాపులర్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు.. ఆయన సినిమాలు ఏమి చూసినా చాలా క్లాసిక్ గా వీక్షకుల ఆదరణ పొందుతున్నాయి. అలాంటి శర్వానంద్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయనకు ఏడాది జనవరి 26వ తేదీన ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. కానీ ఇన్ని నెలలైనా పెళ్లి మాత్రం జరగడం లేదు.. దీనికి కారణం ఏంటో చూద్దామా..

also read:‘కస్టడీ’ మూవీ ట్రైలర్ రిలీజ్… దుమ్ములేపిన నాగచైతన్య

Advertisement

జనవరి 26వ తేదీన హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం జరిగింది. రక్షిత రెడ్డి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన దివంగత బొజ్జాల గోపాలకృష్ణారెడ్డికి స్వయనా మనవరాలు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోబోతుండడంతో, శర్వానంద్ పెళ్లి గురించి అప్పట్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయింది.

Advertisement

also read:SP BALU:ఎస్పీ బాలు గారికి మొదటి పారితోషకం ఎంతిచ్చారో తెలుసా..?

ఈ నిశ్చితార్థం జరిగి నాలుగు నెలలు గడిచిన ఇప్పటికీ పెళ్లి ప్రస్తావన ఎక్కడా లేదు. ఇంకేముంది సోషల్ మీడియాలో దీని గురించి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా వీరి పెళ్లి రద్దయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. అయితే అసలు విషయంలోకి వెళ్తే శర్వానంద్ పెళ్లి రద్దవలేదు శర్వానంద్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, అంతేకాకుండా జాతకానికి తగ్గట్టుగా ముహూర్తాలు అనుకూలించకపోవడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది.

also read:జూన్‌లో “అమ‌ర‌వీరుల స్మార‌కం” ప్రారంభం..ప్రత్యేకతలు ఇవే

Visitors Are Also Reading