Home » SP BALU:ఎస్పీ బాలు గారికి మొదటి పారితోషకం ఎంతిచ్చారో తెలుసా..?

SP BALU:ఎస్పీ బాలు గారికి మొదటి పారితోషకం ఎంతిచ్చారో తెలుసా..?

Ad

ఆయన పాట వింటే ఏడ్చే పిల్లలు సైతం సైలెంట్ అయిపోయి అలా హాయిగా నిద్రపోతారు. అంతటి మధుర గాత్రం కలిగిన ఏకైక గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ప్రస్తుతం ఆయన ఈ సినీ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన ఆయన పాటలు రూపంలో ఎప్పుడు బతికే ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప గాయకుడిగా పేరుపొందారు. ఆయన దాదాపుగా 50 వేలకు పైగా పాటలను పాడి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు.

also read:Ugram movie review:ఉగ్రం మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడ్డట్టేనా..?

Advertisement

అంతటి గాన గాంధర్వుడి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అదేంటయ్యా అంటే అప్పట్లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న అనే చిత్రానికి ఆయన కేవలం 300 రూపాయలు మాత్రమే పారితోషకం తీసుకున్నారట. ఆ రోజుల్లో ఘంటసాల గారు 500 రూపాయలు తీసుకునేవారు. ఈ విషయం గురించి అప్పట్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

Advertisement

ఈ పారితోషకం రాకముందు మా నాన్నగారు నాకు నెలకు 80 రూపాయలు పంపేవారు. నాలుగు నెలల తర్వాత ఇక నాన్న నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని అనిపించింది. ఆ సమయంలో తెగ సంతోషపడ్డాను. నేను నా ఫ్రెండ్ మురళి డ్రైవిన్ ఉడ్ల్యాండ్స్ కి వెళ్లి చక్కగా గులాబ్ జామున్, మసాలా దోశ తిన్నాం. అది చాలా ప్లాన్ చేస్తే గాని వెళ్లగలిగే రోజులు కావు. అంతేకాదు ఆరోజున జేమ్స్ బాండ్ సినిమాకి వెళ్ళాం. అంతవరకు 84 పైసలు సినిమాకి వెళ్తే ఆ రోజున రూపాయి పావులకు వెళ్లాం. అలాగే కోక్ కూడా తాగామని తెలియజేశారు.

also read:Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్

Visitors Are Also Reading