Home » సౌందర్య భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

సౌందర్య భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

by Anji
Ad

దివంగత నటీ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు దక్కించుకున్న ఈమె ఇండస్ట్రీలో ఉండే చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించారు. ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఇప్పటికీ సౌందర్య అభిమానులు ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా తన నటనతో భారీ పాపులారిటీ దక్కించుకుంది.

Advertisement

తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ సినిమాలలో కూడా నటించి దక్షిణాదినే కాదు ఉత్తరాదిని కూడా ఒక ఊపు ఊపిన సౌందర్య.. 2000స్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. కెరియర్ పీలో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితులు రఘుని వివాహం చేసుకున్న ఈమె.. వైవాహిక జీవితంలో మాత్రం ఆ ఆనందాన్ని అనుభవించే అదృష్టాన్ని పొందలేక పోయింది. 2004 లోనే ఒక రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ఇక సౌందర్య మరణించినప్పుడు.. వీరి వివాహం జరిగి సంవత్సరం కూడా కాలేదు.

Advertisement

అంతలోనే ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. సౌందర్య మరణించిన తర్వాత ఆమె జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు నిర్వహించారు రఘు.. అంతే కాదు సౌందర్య పేరు మీద స్కూల్ కూడా నడుపుతున్నారు.. ఇతర సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.. ఇలాంటి రఘు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం రఘు గోవాకి చెందిన డాక్టర్ అర్పితను రెండవ వివాహం చేసుకొని.. ప్రస్తుతం విదేశాలలో సెటిల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సౌందర్య విషయానికి వస్తే.. 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading