Home » సురేఖ, ఉపాసన, లావణ్య త్రిపాఠిలో ఉన్ కామన్ పాయింట్ గురించి మీకు తెలుసా ?

సురేఖ, ఉపాసన, లావణ్య త్రిపాఠిలో ఉన్ కామన్ పాయింట్ గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ 01న ఇటలీలోని టస్కానీలో జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి వేడుక కోసం ఇటు మెగా ఫ్యామిలీ.. అటు లావణ్య ఫ్యామిలీ ముందుగానే వెళ్లి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. గత కొద్ది రోజులుగా వీరి పెళ్లి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.    

Advertisement

తాజాగా మరో వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. అక్టోబర్ 30న మెహిందీ, సంగీత్ ఈవెంట్లు జరిగాయి. ఆ తరువాత పెళ్లి జరిగింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలిలో సురేఖ, ఉపాసన, లావణ్య త్రిపాఠిల మధ్య ఉన్న కామన్ పాయింట్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ సహాయం చేయడంలో ముందుంటారు. ఆమె లాగే రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా సహాయం చేసే మనస్తత్వం ఉందనే విషయం చాలా సార్లు వార్తల్లో నిలిచింది. ఉపాసన పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారనే విషయం తెలిసిందే. వీరిద్దరి మాదిరిగానే లావణ్య కూడా హెల్పించే అలవాటు ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

 

తన సంపాదనలో 50 శాతం పేదలకు పంచుతుందట. ఆమె చేసిన గొప్ప పనుల గురించి పెద్దగా చెప్పుకోదని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ముగ్గురిలో ఉన్న కామన్ క్వాలిటి తెగ వైరల్ అవుతోంది. వీరి హెల్పింగ్ నేచర్ గురించి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతుల రిసెప్షన్ వేడుక నవంబర్ 05న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగనుంది. ఈ దంపతులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపాలని అభిమానులు విషెస్ చెబుతున్నారు. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading