Home » ఆదిపురుష్ మూవీకి ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా ? 

ఆదిపురుష్ మూవీకి ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా ? 

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కోసం ప్రేక్షకుల ఎప్పటినుంచో ఎంతో ఆశతో ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన మూవీ కావడంతో సినిమాను ప్రేక్షకులు బాగానే వీక్షించే అవకాశముంది. ముఖ్యంగా ఫ్యామిలీస్, చిన్న పిల్లలు చాలా ఆసక్తిగా చూస్తారు కాబట్టి ఈ మూవీ కలెక్షన్లను భారీగానే వసూలు చేసే అవకాశముంది. బాహుబలి తరువాత వచ్చిన ఒక్క సినిమా కూడా ప్రభాస్ అభిమానులను సంతృప్తి పరచలేకపోయింది. ఆదిపురుష్ మూవీ కాస్త సంతృప్తి పరిచిందని అభిమానులు పేర్కొంటున్నారు. 

Adipurush

Adipurush

రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాఘవుడిగా, కృతిసనన్ జానకిగా నటించారు. ఈ సినిమా కోసం హీరో ప్రభాస్ భారీగానే పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ వార్తనే వాస్తవం అయితే ప్రభాస్ దాదాపు రూ.150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది ఈ మూవీ మొత్తం బడ్జెట్ రూ.500 కోట్లు కాగా.. రావణుడి పాత్రను బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పోషించాడు. ఈ సినిమా కోసం సైఫ్ రూ.12కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడట. 

Advertisement

Advertisement

దీంతో బాలీవుడ్ నెగెటివ్ రోల్స్ లో నటించే నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకున్న వారి జాబితాలోకి సైఫ్ చేరిపోయాడు. ఆదిపురుష్ హీరోయిన్ కృతిసనన్ జానకి పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. ఆమె పారితోషికం రూ.3కోట్లు తీసుకుందట. ఇక లక్ష్మణ్ పాత్రలో నటించిన సన్నిసింగ్ రూ.1.5 కోట్లు, అదేవిధంగా ఆంజనేయుడి పాత్రలో నటించిన దేవ్ దత్త గజానన్ నాగే కూడా రూ.1.5కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఆదిపురుష్ మూవీ మిశ్రమ టాక్ తో మొదటి థియేటర్లలో దూసుకెళ్తోంది. ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేస్తుందో కొద్ది రోజులు వేచి చూడాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పోతినేని రామ్ పెళ్లి చేసుకోబోతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

శోభన్ బాబు జయలలిత లవ్ స్టోరీ.. ఆ డైరీలో ఏముందో తెలుసా ?

స్వేచ్ఛ అంటే ఇదేనా..? ఇలా ఓటీటీలో రెచ్చిపోతే.. నేటి తరం యువత నాశనానికి మీరే కారణం అవుతారు..!

Visitors Are Also Reading