Home » అయోధ్య రామ మందిరానికి పవన్ కళ్యాణ్ ఎంత విరాళం ఇచ్చారో తెలుసా ?

అయోధ్య రామ మందిరానికి పవన్ కళ్యాణ్ ఎంత విరాళం ఇచ్చారో తెలుసా ?

by Anji
Ad

అయోధ్యలో ప్రస్తుతం రామ మందిరం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 22న ప్రారంభం చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తున్నారు. దీంతో దేశం మొత్తం ఎక్కడ చూసినా అయోధ్య రామ మందిరం గురించే మాట్లాడుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అయింది. రాముడి విగ్రహ ప్రతిష్ట జనవరి 22న జరుగనుంది. ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి హిందువులు.. రామభక్తులు రానున్నారు.

Advertisement

ఈ రామ మందిరం కోసం అన్ని ప్రాంతాల నుంచి మట్టి, నీరు వంటివి తీసుకెళ్లారు. వీటితో పాటు ప్రతీ గ్రామం నుంచి ఎంతో కొంత విరాళాలు కూడా వెళ్లాయి. సినీ ఇండస్ట్రీ నుంచి.. పొలిటిషియన్ నుంచి ఇలా పలువురి వద్ద నుంచి రామ మందిరానికి విరాళాలు అందజేశారట. అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్స్ కి ఆహ్వానం అందినట్టు వార్తలు వినిపించాయి.

Advertisement

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  రామ మందిరానికి తన వంతు విరాళంగా దాదాపు 30 లక్షల వరకు ఇచ్చారట. అంతేకాకుండా తనతో సినిమాలు చేసే దర్శక నిర్మాతలతో కూడా విరాళం అందించారట. అలా పవన్ కళ్యాణ్ తరపు నుండి అయోధ్య రామ మందిర  నిర్మాణానికి దాదాపు 80 లక్షల వరకు విరాళాలు వెళ్లాయని తెలుస్తోంది. ఇక సినీ ఇండస్ట్రీ నుండి దాదాపు నాలుగు కోట్ల వరకు విరాళాలు రామ మందిరానికి వెళ్లినట్టు సమాచారం. రామ మందరం ప్రారంభోత్సవానికి ఎవరెవరు హాజరవుతారో చూడాలి మరీ.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading