Home » సింహాద్రి మూవీకి పోటీగా వచ్చి సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రం గురించి మీకు తెలుసా ?

సింహాద్రి మూవీకి పోటీగా వచ్చి సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రం గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైనటువంటి విక్టరీ వెంకటేష్ అప్పట్లో ఫ్యామిలీ హీరోగా పేర్గాంచాడు. ఆయన ఏ సినిమా తీసినా అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరేవారు. నువ్వునాకు నచ్చావ్ వంటి క్లాసిక్ హిట్ మూవీ తరువాత వెంకటేష్ మళ్లీ ఏ సినిమాతో వస్తాడా అని ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో వాసు అనే మూవీ తీశాడు. ఈ చిత్రం పరాజయం పాలైంది. ఇక ఆ తరువాత అదే కోవలో జెమిని మూవీ తీశాడు అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.

simhadri

Advertisement

ఒక మాస్ హీరోగా ఎదగాలనుకున్న వెంకటేష్ ప్రయత్నం ఈ సినిమా ద్వారా బెడిసి కొట్టిందనే చెప్పాలి. అతని కెపాసిటీ ఫ్యామిలీ సినిమాలు తీయడమే అని మరోసారి నిరూపితం చేసింది వసంతం మూవీ. వాసు, జెమినీ వంటి పరాజయాల తరువాత వెంకటేష్ కి దక్కిన హిట్ మూవీ ఇది. ఈ చిత్రం 2003లో విడుదలైంది. తమిళంలో స్టార్ డైరెక్టర్ గా ఉన్న విక్రమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అతను తెలుగులో నేరుగా తీసిన తొలి చిత్రం వసంతం కావడం విశేషం.  ఈ సినిమా తరువాత చెప్పవే చిరుగాలి మూవీ తీసి మరొక విజయాన్ని అందుకున్నారు. కానీ విక్రమన్ ఎందుకో తెలుగు సినిమాలే తీయలేదు. కొన్నాళ్లకు అతని కెరీర్ ముగిసిపోయింది.

Advertisement

ఇక వసంతం మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమా క్లాసిక్ విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం.. ఈ చిత్రానికి సంగీతం అందించినటువంటి ఎస్.ఏ.రాజ్ కుమార్ అని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లింది తొలుత పాటలే. ఆ తరువాత సినిమా కథ, మిగతా విషయాలు. వసంతం మూవీకి సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..? సింహాద్రి మూవీకి పోటీగా విడుదలై ఘన విజయాన్ని సాధించడం రెండు సినిమాలకు ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వారికి ఉంటుంది. సింహాద్రి ప్రభంజనం అప్పట్లో గట్టిగానే ఉండేది. అయినప్పటికీ వసంతం మూవీ ఓ డీసెంట్ హిట్ గా నిలవడమే కాకుండా వెంకటేష్ ని మళ్లీ ఫామ్ లో ఉంచింది. ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్, కళ్యాణీ హీరోయిన్లుగా  ఇద్దరూ నటించారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Allu Arjun : జాతీయ అవార్డుతో రెమ్యూనరేషన్‌ పెంచిన అల్లు అర్జున్‌ !

NTR : ఎన్టీఆర్‌కు మూడ్‌ బాగోకపోతే రూమ్ లోకి వెళ్లి…అలాంటి పని చేస్తాడట..?

Visitors Are Also Reading