Home » అల్ల‌రోడి వ‌దిన గురించిన ఈ విష‌యాలు తెలుసా?

అల్ల‌రోడి వ‌దిన గురించిన ఈ విష‌యాలు తెలుసా?

by Bunty
Published: Last Updated on
Ad

ఈవీవీ స‌త్య‌న్నారాయ‌ణ గురించి ఇండస్ట్రీలో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఇండస్ట్రీలో కిత‌కిత‌లు పెట్టించే సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు ఆయ‌న‌, జంబ‌ల‌క‌డిపంబ అంటూ న‌వ్వించిన ఈవీవీ త‌న ఇద్ద‌రు కుమారుల‌ను సినిమా ఇండ‌స్ట్రీలోకి తీసుకువ‌చ్చేందుకు చాలా ప్ర‌య‌త్నం చేశారు.

aryan-rajesh-wife

Advertisement

Advertisement

ఆర్య‌న్ రాజేష్ హీరోగా నిల‌దొక్కుకోలేక‌పోయాడు. దీంతో ఆయ‌న సినిమా ఇండ‌స్ట్రీకి ప్ర‌స్తుతం దూరంగా ఉంటున్నారు.

అయితే, అల్ల‌రి న‌రేష్ మాత్రం కామెడీ హీరోగా ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ్డాడు. అయితే, ఎనిమిదేళ్లపాటు అల్ల‌రి న‌రేష్ ప్లాప్‌ల‌ను ఎదుర్కొన్నాడు. త‌న సినీ కెరీర్ అయిపోయింద‌ని అనుకున్న స‌మ‌యంలో మ‌హ‌ర్షి సినిమాలో సెకండ్ హీరో క్యారెక్ట‌ర్ రావ‌డంతో మ‌ళ్లీ నిల‌బ‌డ్డారు. ఈ సినిమా త‌రువాత చేసిన నాంది సినిమాలో సీరియ‌స్ క్యారెక్ట‌ర్‌లో అల్ల‌రి న‌రేష్ వావ్ అనిపించాడు. ఇక ఇదిలా ఉంటే, అల్ల‌రి న‌రేష్ వ‌దిన సుభాషిణి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది. 2011, జ‌న‌వ‌రి 5 వ తేదీన ఆర్య‌న్ రాజేష్ కు సుభాషిణికి నిశ్చితార్థం జ‌రిగింది. ఈ నిశ్చితార్థం జ‌రిగిన వారం రోజుల‌కే పాపం ఈవీవీ మ‌ర‌ణించాడు. ఆర్య‌న్ కుటుంబానికి సుభాషిణి అండ‌గా నిలిచింది. త‌న కుటుంబంగా భావించి అండగా నిలిచింది. వివాహ‌మైన మ‌రుస‌టి ఏడాది సుభాషిణి, ఆర్య‌న్ రాజేష్‌కు బాబు పుట్టాడు. ఈవీవీని బాబులో చూసుకుంటున్నారు. సుభాషిణి లేకుంటే త‌మ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ల‌మ‌ని అనేక సంద‌ర్భాల్లో ఆర్య‌న్ రాజేష్‌, అల్ల‌రి న‌రేష్‌లు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

Visitors Are Also Reading