Home » ఒంగోలులో రహస్యంగా జ్యోతిష్యుడుని కలిసిన విజయమ్మ… మతం మార్చుతున్నారా ?

ఒంగోలులో రహస్యంగా జ్యోతిష్యుడుని కలిసిన విజయమ్మ… మతం మార్చుతున్నారా ?

by Bunty
Ad

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైయస్ విజయమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటూ వస్తోంది వైఎస్ విజయమ్మ. హైదరాబాదులోని వైయస్ షర్మిల ఇంట్లో విజయమ్మ ఉంటున్నారు. అయితే షర్మిల దగ్గర ఉంటూనే తాజాగా ఓ ప్రముఖ జ్యోతిష్యుని కలిశారు విజయమ్మ.

Did YS Vijayamma Meet Popular Siddhanti In Ongole

Did YS Vijayamma Meet Popular Siddhanti In Ongole

ఒంగోలు సమీపంలో ప్రముఖ సిద్ధాంతిగా పేరున్న అద్దేపల్లి హనుమంతరావును వైయస్ విజయమ్మ కలిసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ విషయం రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి వైయస్ విజయమ్మ కుటుంబం క్రిస్టియన్ కుటుంబం. వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి విజయమ్మ అల్లుడి వరకు అందరూ క్రైస్తవ మతంలోనే ఉన్నారు. అంతేకాదు విజయమ్మ ఎక్కడ కనిపించినా చేతిలో బైబిల్ పట్టుకొని ఉంటుంది.

Advertisement

Advertisement

అలాంటి వైయస్ విజయమ్మ ఒంగోలులోని ఓ సిద్ధాంతి వద్దకు వెళ్లడం కొత్త చర్చకు దారి తీసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి జ్యోతిష్యం గురించి వెళ్లిందా ? లేక వైయస్ షర్మిల జ్యోతిష్యం గురించి అతని దగ్గరికి వెళ్లిందా ? అని కొంతమంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే తెలంగాణలో వైయస్ షర్మిల సొంతంగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసే ముందు.. షర్మిల జాతకం, వైయస్సార్ టిపి నేతల భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ఆ జ్యోతిష్యుడు దగ్గరికి విజయమ్మ వెళ్లినట్లు కొంతమంది చెబుతున్నారు. ఏదేమైనా విజయమ్మ ఇలా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading