Home » ప్రభాస్ అభిమానులకు జగపతి బాబు షాక్ ఇచ్చాడా..? అసలు ఏం జరిగిందంటే..?

ప్రభాస్ అభిమానులకు జగపతి బాబు షాక్ ఇచ్చాడా..? అసలు ఏం జరిగిందంటే..?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ దర్శకుడు  ప్రశాంత్ నీల్  కాంబినేషన్ లో సలార్ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన గత సినిమా ఆదిపురుష్ కాస్త నిరాశ పరచడంతో సలార్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి మూవీ తరువాత ప్రభాస్ కి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస డిజాస్టర్స్ వచ్చిన నేపథ్యంలో ఈ మూవీ హిట్ అవ్వడం కీలకంగా మారింది.

Advertisement

 

సలార్ టీజర్ ఇటీవలే విడుదలై సినిమా పై అంచనాలు పెంచిన క్రమంలో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో మెయిన్ విలన్ గా నటిస్తున్న జగపతి బాబు అభిమానులకు ఫ్యాన్స్ కి మరోసారి  ఆశ్చర్యపడే వార్త చెప్పాడు. గతంలో తాను ఐదు రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నానని చెప్పి బాంబు పేల్చిన జగపతిబాబు ఇప్పుడు కూడా అలాంటి ప్రకటనే చేశాడు. ముఖ్యంగా జగపతి బాబు సలార్ మూవీలో విలన్ అయినప్పటికీ ప్రభాస్ కాంబినేషన్ లో ఒక్క సీన్ కూడా ఉండదని చెప్పుకొచ్చాడు. తనకు ప్రభాస్ కి మధ్య సీన్లు పార్ట్ 2లో మాత్రమే ఉంటాయని.. పార్ట్ 1లో ఉండవని తెలిపాడు జగపతి బాబు. ఇది ప్రశాంత్ నీల్ మార్క్ డైరెక్షన్ అని అంటున్నారు.

Advertisement

టీజర్ లో కూడా జగపతి బాబు ఒక్క షాట్ లో కూడా కనిపించలేదు. కానీ సలార్ స్క్రీన్ ప్లే పై చాలా ఆసక్తి పెరుగుతోంది. ప్రభాస్ కి జోడీగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. వరుస ఫ్లాప్స్ వస్తున్నప్పటికీ ఆదిపురుష్ మూవీకి మంచి ఓపెనింగ్స్ రావడంతో సలార్ కి కూడా బిజినెస్ హై రేంజ్ లో జరుగుతోంది. ఈ మూవీకి కేజీఎఫ్ తో లింక్స్ ఉన్నాయని టీజర్ తో స్పష్టం అవ్వడంతో ప్రశాంత్ నీల్ యూనివర్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఆదిపురుష్ వంటి డిజాస్టర్ మూవీ తరువాత వస్తున్న సలార్ సినిమా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఎన్టీఆర్-అల్లు అర్జున్ పోటీ పడనున్నారా..?

 రాజకీయాల్లోకి రాబోతున్న అభిషేక్ బచ్చన్..? ఆ స్థానం నుంచే పోటీ..?

Visitors Are Also Reading