Home » మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్ .. కేంద్రం కీలక ఆదేశాలు.. జాగ్రత్త..!

మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్ .. కేంద్రం కీలక ఆదేశాలు.. జాగ్రత్త..!

by Anji
Ad

భారతదేశంలో మరోసారి కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్లు కేంద్ర వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గత రెండేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను వణికించిన విషయం మనకు తెలిసిందే. అయితే మన్నటి వరకూ రకరకాల వేరియంట్లు వచ్చినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చిన కోవిడ్ జెఎన్.1 వీరియంట్ పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపిస్తున్నట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన రిపోర్టులో గుర్తించబడింది.కోవిడ్ జెఎన్.1 వేరియంట్ పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

కేరళకు చెందిన 79 ఏళ్ల మహిళలో ఓమిక్రాన్ సబ్-వేరియంట్ బిఏ. 2.86తో పాటు జెఎన్.1 అనే కొత్త వేరియంట్ కనుగొనబడింది. దీంతో కోవిడ్ కేసుల పెరుగుదల మళ్లీ ఆందోళనలను కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ప్రతిరోజు ఈ కేసుల సంఖ్య రెండువేల కి చేరుకుంటుందని తెలిపింది. కేరళలో నలుగురు, ఉత్తరప్రదేశ్ లో ఒకరు, మొత్తం ఐదు మంది మరణించినట్లు ప్రకటించింది. ఈ రకమైన వైరస్ అన్ని దేశాలలో అభివృద్ధి చెందుతోందని, త్వరగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. జెఎస్.1 వీరియంట్ ఎలాంటి లక్షణాలు లేని ఇన్ ఫెక్షన్ నుండి తీవ్రమైన వ్యాధిగా మారి మరణానికి దారి తీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ మరియా వాన్ కెర్ ఖోవ్ చెప్పారు. అమెరికా, చైనాతో సహా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నందున, సింగపూర్ ఇటీవల మాస్క్ వాడాలని సూచించింది. దీంతో పాటు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులను హెచ్చరించింది.

Advertisement

 


మన దేశం విషయానికి వస్తే.. కర్ణాటకలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మాస్క్ తప్పనిసరి చేసింది. కేరళలో సరిహద్దు ప్రాంతాలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. జెఎస్.1 అనేది ఒక కొత్త వీరియంట్. ఇది 2022 జనవరి- మార్చిలో మన దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ గా రూపాంతరం చెందినట్లు తెలిపారు. దీని ప్రభావంతో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. చాలా మందికి తేలికపాటి అనారోగ్యాలను కలిగిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులకు, 65 ఏళ్లు పైబడిన వారికి మధుమేహం లేదా ఉండే జబ్బులు, క్యాన్సర్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. తేలికపాటి అనారోగ్యం నుంచి తీవ్రమైన ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం క్రిస్మస్, పెళ్లిళ్ల సీజన్ లు ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. అందరూ ఒకే చోట గుమిగూడటం వల్ల ఈ వైరస్ మరింతగా వృద్ధి చెందేలా చేస్తుంది. గతంలో వచ్చిన వేరియంట్ల కంటే కూడా జెఎన్ వేరియంట్ ప్రభావం తీవ్రంగా పడుతుందని చెబుతున్నారు డాక్టర్లు.

Visitors Are Also Reading