Home » PM MODI : కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్.. లోక్ సభలో రాహుల్ పై విమర్శలు..!

PM MODI : కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్.. లోక్ సభలో రాహుల్ పై విమర్శలు..!

by Anji
Ad

కొత్త పార్లమెంట్ లో కొత్త సంప్రదాయం అందరినీ ఆకట్టుకుంటుందన్నారు ప్రధాని మోడీ. ప్రజాస్వామ్య గౌరవం అనేక రెట్లు పెరిగిందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోడీ.. కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, దాని ప్రత్యర్థులను మోడీ వదిలిపెట్టలేదు. దేశంలో బీజేపీ హ్యట్రిక్ కొట్టడం ఖాయమన్న మోడీ.. భారతదేశంలో మూడవ అతిపెద్ద్ ఆర్థికవ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ఇది మోడీ ఇస్తున్న గ్యారెంటీ అన్నారు.

Advertisement

ప్రతిపక్షాలు ప్రతిసారీ దేశాన్ని నిరాశపరిచాయని ప్రధాని అన్నారు. మైనారిటీ పేరుతో ఎంతకాలం విభజన చేస్తారు? సమాజాన్ని విడదీస్తూ ఎంతకాలం ఉంటారు? ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో కూడా ప్రతిపక్షాలకు నేర్పిస్తాను. విపక్షాలు ఎంతకాలం ముక్కలుగా ఆలోచిస్తాయి? కాంగ్రెస్ మంచి ప్రతిపక్షం కాలేకపోయింది. రాహుల్‌ను ప్రయోగించడంలో కాంగ్రెస్ విఫలమైందని ప్రధాని మోడీ అన్నారు. కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే స్థాయికి పరిస్థితి చేరుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీ కుటుంబ పార్టీ కాదు. బీజేపీ అంటే కేవలం అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ పార్టీ మాత్రమే కాదు. కానీ కాంగ్రెస్ కుటుంబ పార్టీ.

Advertisement

 

కాంగ్రెస్ కుటుంబంలో చిక్కుకుపోయింది. కాంగ్రెస్ కుటుంబం బయట చూడదు. అదే ఉత్పత్తిని మళ్లీ మళ్లీ విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ది క్యాన్సర్ కల్చర్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు మోడీ. నేను పదేళ్లలో ఏం చేశానో, కాంగ్రెస్‌కు 100 ఏళ్లు పట్టేదని ప్రధాని మోదీ అన్నారు. 5 తరాలు గడిచిపోతాయి. పట్టణ పేదలకు 80 లక్షల పక్కా ఇళ్లు కట్టించాం. 17 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. కాంగ్రెస్ వ్యూహాల వల్ల ఈ పనికి 60 ఏళ్లు పట్టేది. రాహుల్ గాంధీ ఓబీసీల గురించి మాట్లాడుతున్నారని,ఓబీసీ ప్రధాని అయితే రాహుల్ గాంధీ సహించలేరంటూ విమర్శించారు.

 

Visitors Are Also Reading