Home » చంద్రబాబుకు ఘోర అవమానం… ఏకంగా హైదరాబాద్ స్టేడియంలోనే ?

చంద్రబాబుకు ఘోర అవమానం… ఏకంగా హైదరాబాద్ స్టేడియంలోనే ?

by Bunty
Ad

వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా నిన్న పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక జత మధ్య ఎనిమిదో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు విజయం నుంచి ఏకంగా ఆరు వికెట్ల తేడా తో విజయం సాధించింది. శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి 344 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని 48.2 ఓవర్లలోనే పాకిస్తాన్ చేదించగలిగింది.

Chandrababu Naidu's placard displayed at Hyderabad stadium

Chandrababu Naidu’s placard displayed at Hyderabad stadium

దీంతో వరల్డ్ కప్ టోర్నమెంట్లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది పాకిస్తాన్ జట్టు. మొదటి మ్యాచ్ లో నెదర్లాండ్ జట్టుపై గెలిచిన.. పాకిస్తాన్ జట్టు… నిన్న శ్రీలంక జట్టు పైన కూడా గెలిచింది. క్రికెట్ మ్యాచ్ గురించి పక్కన పెడితే… పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లకార్డును స్టేడియంలో చూపించాడు.

Advertisement

Advertisement

ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగగా…. మ్యాచ్ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు ఫోటోను చూపించి… ఆయనను స్కాం స్టార్ అంటూ ప్రేక్షకులు ఫ్లకార్డు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా చంద్రబాబు నాయుడు దాదాపు 32 రోజులుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading