Home » Chandrababu : ఏసీబీ కోర్టుకు చంద్రబాబు లేఖ…జైల్లో నన్ను చంపేందుకు కుట్ర.. డ్రోన్లు వేసి మరీ !

Chandrababu : ఏసీబీ కోర్టుకు చంద్రబాబు లేఖ…జైల్లో నన్ను చంపేందుకు కుట్ర.. డ్రోన్లు వేసి మరీ !

by Bunty
Ad

ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. ఈ మేరకు జైలు అధికారుల ద్వారా ఏసీబీ జడ్జికి లేఖ పంపారు చంద్రబాబు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ మూడు పేజీల లేఖ రాసారు చంద్రబాబు. నాకు జెడ్ ప్లస్ సెక్యూర్టీ ఉంది…నేను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా నన్ను వీడియోలు.. ఫొటోలు తీశారని లేఖలో చంద్రబాబు వెల్లడించారు. ఆ ఫుటేజ్ ను స్వయంగా పోలీసులే లీక్ చేశారు…. నా రెప్యూటేషన్ను దెబ్బ తీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారని ఆగ్రహించారు.

Chandrababu has two ways to escap from scam

Chandrababu has two ways to escap from scam

నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. దీనికి సంబంధించిన లేఖను తూ. గో జిల్లా ఎస్పీకు ఈ విషయమై లేఖ కూడా వచ్చిందని లేఖలో చంద్రబాబు..వెల్లడించారు. ఆ లేఖపై ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదని మండిపడ్డారు. ఎస్ కోటకి చెందిన ఓ ముద్దాయి జైల్లో పెన్ కెమెరాతో విజువల్స్ తీస్తున్నారని నా దృష్టికి వచ్చింది…. నా కదలికల కోసం జైలుపై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Advertisement


ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈ డ్రోన్లు ఎగరేశారని భావిస్తున్నానని లేఖలో చంద్రబాబు తెలిపారు. డ్రోన్ల ఎగరేసిన ఘటనలోనూ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవన్నారు.ఈ నెల 6వ తేదీన నన్ను కలవడానికి నా ఫ్యామ్లీ మెంబర్స్ వచ్చిన సందర్భంలో సెంట్రల్ జైలు మెయిన్ గేట్ వద్ద మరో డ్రోన్ ఎగరేశారన్నారు చంద్రబాబు. నా భద్రతే కాదు.. నా కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఉన్నానన్నారు. మరి చంద్రబాబు లేఖ పై కోర్టు ఎలా స్పందింస్తుందో చూడాలి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading