Home » జగన్‌ సర్కార్‌ సంచలనం…బ్రాహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణపైనా కేసులు ?

జగన్‌ సర్కార్‌ సంచలనం…బ్రాహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణపైనా కేసులు ?

by Bunty
Ad

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు…రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అటు నారా లోకేష్ ను కూడా రేపు అరెస్టు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వైసిపి రెబల్ ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ గురించి బాంబు పేల్చారు ఆనం రామనారాయణరెడ్డి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా లోకేష్ తోపాటు నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి, నందమూరి బాలయ్య పేర్లను చేర్చి…. సిఐడి మెమో ఫైల్ చేసినట్లు మాకు సమాచారం అందిందంటూ పేర్కొన్నారు. దీనిపై న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నామని… ఈ అంశంలో ప్రభుత్వంతో ఎలా పోరాడాలని దానిపై కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు ఆనం రామనారాయణరెడ్డి.

Advertisement

నెల్లూరు జిల్లా టీడీపీ, జనసేన నాయకులు సీపీఐ పార్టీ నాయకులతో కలిసి ఐక్య కార్యాచరణపై ఆనం రామనారాయణరెడ్డి ఇవాళ చర్చించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసన గా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున శాంతియుత ర్యాలీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజా పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం కలిసి పోరాడుదామని వెల్లడించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు, వేధింపులు చేస్తున్నారు అని ఆనం తెలిపారు, దీని కోసం అందరం కలసి పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading