Home » శ్రేయాస్ ను వెన్నుపోటు పొడిచిన మెకల్లమ్..!

శ్రేయాస్ ను వెన్నుపోటు పొడిచిన మెకల్లమ్..!

by Azhar
Ad
భారత జట్టులో కీలకమైన ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ను.. బ్రెండన్ మెకల్లమ్ వెన్నుపోటు పొడిచాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతుంది. అయితే గత ఏడాది వరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడిన అయ్యర్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవరించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ జట్టుకు హెడ్ కోచ్ గా బ్రెండన్ మెకల్లమ్ వ్యవరిస్తున్నాడు. కానీ ఐపీఎల్ జరుగుతున్న సమయంలో వీరికి విబేధాలు వచ్చాయి అనే వార్తలు వచ్చాయి. కానీ అదలా ఉంటె.. ఈ ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లాండ్ జట్టుకు హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు.
అయితే ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ జట్టుతో కలిసిన బ్రెండన్ మెకల్లమ్.. మొదట తన సొంత జట్టు అయిన న్యూజిలాండ్ కు వ్యతిరేకంగా ఆడి… కివీస్ ను ఓడించాడు. అయితే ఇప్పుడు ఆ ఇంగ్లాండ్ జట్టు మన ఇండియాకు వ్యతిరేకంగా గత ఏడాది వాయిదా పడిన టెస్ట్ అనేది ఆడుతుంది. ఇక ఈ మ్యాచ్ ఆడుతున్న ఇండియా జట్టులో శ్రేయాస్ అయ్యర్ కూడా ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో ఆధిక్యం సంపాదించిన భారత జట్టు నిన్న రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇక ఈరోజు కూడా దానిని కొనసాగించింది.
ఇక నేడు మ్యాచ్ ప్రారంభమైన తర్వాత… శ్రేయాస్ అయ్యర్ బేటింగ్ కు వచ్చాడు. అయితే అక్కడ అయ్యర్ పంత్ తో కలిసి భాగసౌమ్యం నెలకొల్పే ప్రయత్నం చేస్తుంటే. అప్పుడు బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లాండ్ బౌలర్లకు అయ్యర్ యొక్క వీక్నెస్ అనేది చెప్పాడు. దాంతో వెంటనే ఇంగ్లాండ్ అయ్యర్ ను ఔట్ చేసింది. ఐపీఎల్ లో హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు మెకల్లమ్.. తన జట్టు కెప్టెన్ శ్రేయాస్ యొక్క బలహీనత తెలుసుకొని ఇప్పుడు దానిని అతనికి వ్యతిరేకంగా వాడాడు అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదే విషయాని చెబుతూ.. మెకల్లమ్ వెన్నుపోటు పొడిచాడు అని ఆరోపిస్తున్నారు.

Advertisement

Visitors Are Also Reading