Home » లండన్ లో పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ధోని, సాక్షి..!

లండన్ లో పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ధోని, సాక్షి..!

by Azhar
Ad
క్రికెట్ ను ఫాలో అవుతున్న ఎవరికైనా ధోని అనే పేరు తప్పకుండ పరిచయం ఉంటుంది. కేవలం ఇండియాలోనే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ధోనికి అభిమానులు ఉన్నారు. అయితే ధోని గురించి తెలిసిన ప్రతో ఒక్కరికి.. ఆయన ప్రేమ గురించి కూడా తప్పకండా తెలిసే ఉంటుంది. ధోని మొదట ప్రేమించిన అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోగా.. తర్వాత సాక్షినీ ప్రేమిస్తాడు. దాదాపు మూడేళ్లు ప్రేమించుకున్న తర్వాత ఈ జంట 2010 జులై 4న పెళ్లి చేసుకున్నారు.
ఇక నేటితో ధోని, సాక్షి పెళ్లి ప్రయాణానికి 12 ఏళ్ళు నిండాయి. దాంతో ఈ జంట తన పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి లండన్ వెళ్ళింది. మాములుగా ధోని, సాక్షి వెకేషన్స్ కు ఎక్కువగా దుబాయ్, యూఏఈకి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ జంట లండన్ కు వెళ్ళింది. తాజాగా అక్కడ తాము తీసుకున్న ఓ ఫోటోను సాక్షి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే గత ఏడాది తమ పెళ్లి రోజు కానుకగా.. ధోని సాక్షికి ఓ కార్ ను బహుమతిగా ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మహి తన భార్యకు ఏం ఇస్తాడు అనేది చూడాలి.
అయితే సాక్షి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ధోని ఇచ్చిన గిస్త్ గురించి వెంటనే అభిమానులకు తెలియజేస్తుంది. కానీ ఇప్పటివరకు అలాంటి విషయం ఏది సాక్షి చెప్పలేదు. అయితే ఈ జంటకు జీవా అనే కూతురు ఉన్న సంగతి తెలిసిందే. ధోని ఇండియాకు లేదా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఎప్పుడు ఆడిన జీవా, సాక్షి తప్పకుండ అక్కడికి వచ్చి ధోనికి తమ మద్దతు తెలుపుతారు. ఇక అప్పుడు జీవా చేసిన అల్లరి అనేది స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. అయితే ప్రస్తుతం ధోని, సాక్షి జంట జీవా కోసం ప్రత్యేకమైన సోషల్ మీడియా అకౌంట్ అనేది ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అందులో 2 మిలియన్స్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు.

Advertisement

Visitors Are Also Reading