Home » IND Vs PAK మ్యాచ్.. ఐఫోన్ పోగొట్టుకున్న ప్రముఖ నటి

IND Vs PAK మ్యాచ్.. ఐఫోన్ పోగొట్టుకున్న ప్రముఖ నటి

by Bunty
Ad

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంటులో టీమిండియా జట్టు… విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. నిన్న అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో రోహిత్ సేన అఖండ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు… 191 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. అయితే ఆ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా.

Bollywood Actress Urvashi Rautela's 24-Carat Gold iPhone Lost at Cricket Match

Bollywood Actress Urvashi Rautela’s 24-Carat Gold iPhone Lost at Cricket Match

ఈ మ్యాచ్ లో మరోసారి రోహిత్ శర్మ బీకర ఇన్నింగ్స్ ఆడాడు. 86 పరుగులు చేసి టీమ్ ఇండియాకు అఖండ విజయాన్ని అందించాడు రోహిత్ శర్మ. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిన్న జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement

అయితే ఈ మ్యాచ్ చూసేందుకు బాలీవుడ్ హీరోయిన్ ఊర్వసి హాజరయ్యారు. అయితే స్టేడియంలో తాను 24 క్యారెట్ గోల్డ్ రియల్ ఐఫోన్ ను పోగొట్టుకున్నట్లు ఊర్వశి తాజాగా పోస్ట్ చేసింది. ఎవరైనా తన ఫోన్ కనిపిస్తే తనను సంప్రదించమని కోరారు ఊర్వశి. సహాయం కోరుతూ అహ్మదాబాద్ పోలీసులను ట్యాగ్ చేశారు. అయితే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… ఆ మాత్రం ఫోన్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవా అని ఊర్వశిపై ఫైర్ అవుతున్నారు నేటిజన్స్.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading