పదవతరగతి ప్రశ్నాపత్రం లీక్ అయిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మొదట పదవతరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయ్యింది. దాంతో విదార్థులు తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. అయితే మరుసటి రోజే హిందీ పేపర్ కూడా లీక్ అవ్వడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Advertisement
అయితే హిందీ పేపర్ లీక్ అవ్వడం వెనక బండి సంజయ్ సూత్రదారి అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అంతే కాకుండా అర్దరాత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్లి పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుగుతోంది. సంజయ్ ని విడిపించేందుకు ఆయన తరపు లాయర్ లు కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈటెల రాజేందర్ కు సైతం అధికారులు షాక్ ఇచ్చారు.
Advertisement
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హస్తం కూడా పేపర్ లీక్ ఘటనలో ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పేపర్ లీక్ అయిన కొద్దినిషాల్లోనే ఈటలకు కూడా ప్రశ్నాపత్రం పంపించారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇప్పుడు ఈటలకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈటెల స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేయబోతున్నట్టు సమాచారం. దాంతో ఈటల ఏమని స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.