బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరును ఇండియా మొత్తంలో గుర్తించేవిధంగా చేసిన సినిమా బాహుబలి. రెండు పార్ట్ లుగా వచ్చిన ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. ఇంతవరకు ఈ మూవీ కలెక్షన్స్ ను ఏ చిత్రం కూడా బీట్ చేయలేదు అంటే ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ వసూలు చేసిందో మనందరికీ తెలుసు. తెలుగు సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూపే వారందరికీ ఇది చెంపపెట్టు లాంటి సినిమా.
Advertisement
అంతటి గొప్ప సినిమాకు దర్శకత్వం వహించారు రాజమౌళి. ఆయన దర్శకత్వం వల్లే సినిమా మన ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అవ్వడమే కాకుండా రికార్డుల మోత మోగించింది. ఇక ఈ సినిమాలో హీరోలు ప్రభాస్, రానా హీరోయిన్ అనుష్క, తమన్నా, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటించారు. అయితే బాహుబలి సినిమాలో కూడా చాలా మిస్టేక్స్ వచ్చాయని కొన్ని ప్రత్యేక వీడియోలు వచ్చాయి. తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది.
Advertisement
ఇందులో ఏముందంటే కాలకేయులు, మాహిష్మతి రాజులు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరికొకరు వినిపిస్తాయి. కాలకేయుడు శివగామిపై వాక్యాలు చేస్తాడు. ఈ విషయాన్ని మాహిష్మతికి చెందిన ఒక అతను ట్రాన్స్ లేట్ చేస్తాడు. ఇది విన్న ప్రభాస్, రానా రెచ్చిపోతారు. అయితే ఇరువురు ప్రత్యర్ధులు పక్కపక్కనే ఉన్నప్పుడు త్రిశూల వ్యూహం ఎందుకు సామీ…దగ్గరికి వెళ్లి యుద్ధం చేయొచ్చుగా..? అని కొందరు కామెంట్స్ పెట్టి ఆ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?
IPL 2023 : ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న గవాస్కర్..ఫోటో వైరల్
BoyapatiRAPO : దున్నపోతుతో రామ్ ఎంట్రీ అదుర్స్…. మాస్ కు ఫ్యాన్స్ కు జాతరే