ఒకప్పుడు కమెడియన్ గానే తెలుసు కానీ మొన్న బలగం సినిమాను తీసి తన బలం ఇది అంటూ చూపించాడు వేణు టిల్లు. దిల్ రాజు బ్యానర్ లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చడంతో పాటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సినిమా డైరెక్టర్ వేణు టిల్లు కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Advertisement
జబర్దస్త్ స్కిట్స్ లో నవ్వించే వేణు దగ్గర ఇంత టాలెంట్ ఉందా అని షాక్ అవుతున్నారు. అంతే కాకుండా వేణు పై చిరంజీవి సైతం ప్రశంసలు కురిపించారు. అయితే వేణు ఇంతలా సక్సెస్ అవ్వడానికి ఎంతో కష్టాపడ్డాడు. ఆ వివరాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సినిమాల కోసం ఇంటినుంది పారిపోయి వచ్చానని చెప్పారు.
Advertisement
అంతే కాకుండా మొదట చిత్రం శ్రీను వద్ద టచప్ బాయ్ గా పనిచేసినట్టు తెలిపాడు. రచయితక అసిస్టెంట్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గానూ ఆ తరవాత పనిచేశానని అన్నారు. దాదాపు 200 సినిమాలలో నటించినా కూడా గుర్తింపు రాలేదని అన్నారు. తన కంటే వెనక వచ్చినవాళ్లకు సైతం గుర్తింపు వచ్చిందని కానీ తనకు గుర్తింపు రాలేదని అన్నారు.
ఇక బలగం కథ రాసుకున్నప్పుడు మొదట తనకు తెలిసిన ఓ దర్శకుడికి వివరించానని చెప్పారు. ఆయన వల్ల ఆ కథ దిల్ రాజు వరకు వెళ్లిందని అన్నారు. దిల్ రాజుకు కథ నచ్చడంతో సినిమా చేశామని అలా చకచకా జరిగిపోయిందని చెప్పాడు. ఇన్నేళ్లకు సక్సెస్ వచ్చినందుకు ఆనందంగా ఉందని…ఒకప్పుడు ఆఫర్ ల కోసం బాత్రూం లు కడగటం…అంట్లు తోమడం లాంటి పనులు కూడా చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు.
ALSO READ :‘రానా నాయుడు’ కోసం వెంకటేష్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?