Home » పాకిస్థాన్ పరువు తీసేసిన బాబర్..!

పాకిస్థాన్ పరువు తీసేసిన బాబర్..!

by Azhar
Ad

పాకిస్థాన్ ఇండియాకు ఏ విషయంలో అయినా కొద్దిగా పోటీ ఇవ్వగలదు అనుకుంటే అది కేవలం క్రికెట్ మాత్రమే. అయితే గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ ఇండియాపై విజయం సాధించింది. అప్పుడు పాక్ జట్టుకు బాబర్ ఆజాం కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు. అయితే ఈ బాబర్ చేతిలోకి జట్టు వచ్చిన తర్వాతే పాక్ కొద్దిగా ప్రదర్శన అనేది చేయగలుగుతుంది.

Advertisement

ఇలా కెప్టెన్సీలో తన మార్క్ అనేది చూపిస్తూ వస్తున్న బాబర్ ఆజాం తెలివిలో మాత్రం చూపించడం లేదు. ఆ మధ్య వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో కీపర్ గ్లోజ్ అనేది వేసుకొని ఫీల్డింగ్ చేసాడు. దాంతో విండీస్ కు 5 పరుగులు లభించాయి. ఒక్క కెప్టెన్ అయ్యి ఉండి ఆ నియమం కూడా తెలియదా అని సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ అనేది చేసారు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి విషయంలోనే ఫ్యాన్స్ కు దొరికిపోయాడు బాబర్.

Advertisement

అయితే ప్రస్తుతం నెదర్లాండ్స్ లో ఉన్న పాక్ జట్టు ఆ దేశ జట్టుతో మూడు వన్డేల సిరీస్ ను ముగించుకుంది. ఇందులో ఆఖరి వన్డేలో నెదర్లాండ్స్ బౌలర్లు పాక్ జట్టును ఆల్ ఔట్ చేసారు. కానీ పాక్ విజయం అందుకుంది. అయితే మ్యాచ్ తర్వాత తమను ఆల్ ఔట్ చేసిన స్కాట్లాండ్ బౌలర్లను మెచ్చుకోవాలి అని బాబర్ కామెంట్ చేసాడు. దాంతో ఏ జట్టుతో ఏ పేరు చెబుతున్నావ్ అని ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ ఆపండి..!

పాకిస్థాన్ ఇండియాను చూసి నేర్చుకోవాలి..!

Visitors Are Also Reading