Home » ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ ఆపండి..!

ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ ఆపండి..!

by Azhar
Ad

గత కొన్ని రోజులుగా భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అలాగే ఆయన భార్య ధనశ్రీ వర్మ ఇద్దరు సోషల్ మీడియాలో ట్రెండ్ లో ఉన్నారు. అయితే చాగల్ ఎప్పుడు ఏదో ఒక్క కోతి పని చేసి ట్రేండింగ్ కు వస్తాడు. కానీ ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు వచ్చింది మాత్రం వేరే కారణం. అదే ఈ ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త తెగ చెక్కర్లు కొడుతుంది. కానీ అలాంటిది ఏం లేదు అని చాహల్ పేర్కొన్నాడు.

Advertisement

ఇక ఇప్పుడు ఇదే విషయంపై చాహల్ భార్య ధనశ్రీ కూడా క్లారిటీ అనేది ఇచ్చింది. ” నాకు డ్యాన్స్ చేస్తుండగా గాయం అయ్యింది. రెండు వారాలుగా రెస్ట్ తీసుకుంటున్నాను. సర్జరీ చేసుకోవాలి డాక్టర్లు సూచించారు. అయితే నేను ఇలా ఉన్న సమయంలో నాకు సహాయం చేసిన నా భార్యను చాహల్ తో పాటుగా.. తన కుటుంబం మొత్తానికి నేను ధన్యవాదాలు చెబుతున్నాను.

Advertisement

అయితే నాకు రెస్ట్ కావాల్సిన ఈ సమయంలో కొందరు పిచ్చి పిచ్చి కామెంట్స్ తో నాకు చికాకు తెపిస్తున్నారు. నాపై ఇంత కోపం వారికీ ఎందుకో నాకు తెలియడం లేదు. కానీ నేను ఇలాంటివి పెద్దగా పట్టించుకోను. నేను ఇక్కడి వరకు ఒంటరిగా వచ్చాను. కాబట్టి ఆ వార్తలు నన్ను ఏం చేయలేవు అని ఓ పెద్ద పోస్ట్ చేసింది ధనశ్రీ. ఇక దానికింద ‘మై ఉమెన్’ అని చాహల్ కూడా కామెంట్ చేసాడు.

ఇవి కూడా చదవండి :

పాకిస్థాన్ ఇండియాను చూసి నేర్చుకోవాలి..!

వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ ఎప్పుడు ప్రకటిస్తుందో తెలుసా..?

Visitors Are Also Reading