Home » ఎట్టకేలకు భారీ బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణాన్ని బయటపెట్టిన అనుష్క..!

ఎట్టకేలకు భారీ బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉండడానికి గల కారణాన్ని బయటపెట్టిన అనుష్క..!

by Mounika
Ad

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ చిత్రాలకు  మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఈ రెండు చిత్రాలు భారీగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీస్ లో దేవసేన మెప్పించిన అనుష్క ఈ చిత్రం తర్వాత ఎటువంటి భారీ బడ్జెట్ చిత్రంలోను నటించలేదు. బాహుబలి తర్వాత 2018లో భాగమతితో ఓ సారి ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజైన నిశ్శబ్దంలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. దీంతో అనుష్క అభిమానుల్లో    ఎప్పటి నుంచో పాన్‌ ఇండియా మూవీస్‌లో ఎందుకు నటించలేదనే విషయంపై ఆసక్తి నెలకొంది.

 

Advertisement

ఇక రీసెంట్ గా విడుదలైన మిస్ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి మూవీతో చాలా రోజుల విరామం తర్వాత అభిమానులను సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క. పి. మహేశ్ బాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రంలో అనుష్క చెఫ్ పాత్రలో అందరినీ మెప్పించింది. ఇక పాన్‌ ఇండియా మూవీ బాహుబలి-2 తర్వాత పెద్దగా మూవీలో కనిపించలేదు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల్లో నటించకపోవడంపై అనుష్క తొలిసారి స్పందించడమే కాకుండా ఈ విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Advertisement

అనుష్క మాట్లాడుతూ..’నేను బాహుబలి తర్వాత భాగమతి సినిమాకు ఓకే చెప్పాను అని, ఆ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నారట అనుష్క. ఎందుకంటే ఆ సమయంలో విశ్రాంతి నాకు చాలా అవసరం. అందువల్లే ఆ సమయంలో పెద్ద ప్రాజెక్టులకు ఓకే చెప్పలేదని, భవిష్యత్తులో మరిన్నీ ప్రాజెక్టులు చేయాలంటే బ్రేక్ తప్పనిసరి అనిపించిందని అనుష్క చెప్పుకొచ్చారు. ఇక కొంత సమయం సినిమాలకు విరామం ఇవ్వాలని నిర్ణయించుకోవడం వల్ల ఎలాంటి స్క్రిప్ట్స్ వినలేదని, కానీ భాషలోనైనా మంచి కథ వస్తే తప్పకుండా చేస్తానాని అనుష్క తెలియజేసింది.

Also Read :

Subbaraju: 45 ఏళ్ళు దాటినా.. నటుడు సుబ్బరాజు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అసలు కారణం ఏంటంటే?

ఒకమ్మాయి.. ముగ్గురు అబ్బాయిలు.. అద్దెకుంటామని ప్లాట్ లోకి.. వారు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

BREAKING : జూనియర్ ఎన్టీఆర్ హెచ్చరిక… మీ పద్ధతి మార్చుకోండి ?

Visitors Are Also Reading