సాధారణంగా ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు పెద్దలు. ఎంత పెద్ద స్టార్ హోదా వచ్చినా ఎంత పేరు ఉన్నా ఎలాంటి వ్యక్తులైన చివరికి ఎవరికో ఒకరికి భయపడాల్సిందే. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సాధించిన ఏఎన్ఆర్ వారిని చూస్తే చాలా భయపడే వారట. మరి వారెవరో ఇప్పుడు చూద్దామా.. ఉదాహరణకు ఎస్వీ రంగారావు గారిని తీసుకుంటే ఆయనకు సీన్లో సావిత్రి గారు ఉంటే ఒక రకమైన భయం లాంటిది ఉంటుందట.
also read:బాహుబలిలో అనుష్కకు డూప్ గా నటించింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Advertisement
మామూలుగా ఎలాంటి సందర్భంలోనూ సీన్ పేపర్ చూసుకోకుండానే డైలాగ్స్ చెప్పగలిగే ఆయన సావిత్రి ఉందంటే ముందు ఒకసారి సీన్ పేపర్ చదివాకే షూటింగ్ మొదలు పెడతారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు విషయానికి వస్తే సెట్ లో ఆ ముగ్గురు వ్యక్తులు ఉంటే ఆయన కూడా భయపడేవారట. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరయ్యా అంటే.. సూర్యకాంతం, రేలంగి, ఎస్వీ రంగారావు. ఈ ముగ్గురు నటనపరంగా ఎలాంటి పాత్రలు చేసిన గొప్ప నటులుగా ఎదిగారు. ఈ ముగ్గురిలో ఎవరు షూటింగ్స్ లో ఉన్న అక్కినేని జాగ్రత్తగా ఉండేవారట.
Advertisement
also read:సంగీత దర్శకుడు థమన్ గురించి సింగర్ గీతా మాధురి ఏమందో తెలుసా ?
అందుకు గల ముఖ్య కారణం పైన చెప్పుకున్న ముగ్గురు నటులు. వారు తమ హావాభావాలతో ఆహార్యంతో ప్రతి సీన్ ని తమ వైపు తిప్పుకునేవారట. అందుకే వారు సినిమా సమయంలో ఎలా రిహార్సల్ చేస్తున్నారో బాగా గమనించి వారిని మించిన ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి అక్కినేని ప్రయత్నాలు చేసే వారట. ఈ విషయాన్ని అక్కినేని నాగేశ్వరరావు తన తోటి నటీనటులతో కూడా చెప్పేవారట. కేవలం ఏఎన్ఆర్ కాకుండా అప్పటి నటుల్లో చాలామందికి ఈ పరిస్థితి ఉండేదని తెలుస్తోంది.
also read:తాను డబ్బు తీసుకోలేదు.. భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న రేవంత్