Home » ఫేస్‌బుక్‌లో పెళ్లి వల విసిరి రూ.46లక్షలు కాజేసిన కిలేడి

ఫేస్‌బుక్‌లో పెళ్లి వల విసిరి రూ.46లక్షలు కాజేసిన కిలేడి

by Bunty
Ad

మాయ మోసాలు,  పలు విధాల సైబర్ మోసాల గురించి పోలీసులు ఎన్ని రకాలుగా ప్రజలను జాగ్రత్తపరిచినా సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ప్రజల బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకొని తమ పని కానిచ్చేస్తున్నారు. ఆఖరికి చదువుకున్న వారు కూడా ఈ మోసాలకు బలవుతున్నారు. టెక్నాలజీ పెరగడంతో అదే స్థాయిలో మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొత్త కొత్త దారుల్లో కేటుగాళ్లు అమాయకులను నిండా ముంచేస్తున్నారు.

Advertisement

ఆన్లైన్ వేదికగా జరిగే ప్రతి వ్యవహారాన్ని మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.అయితే తాజాగా, ఓ మహిళ ఫేస్బుక్ లో పెళ్లి వల్ల విసిరి రూ. 46 లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం ఓ వ్యక్తికి ఫేస్బుక్ లో అపర్ణ అలియాస్ శ్వేత పరిచయమైంది. తనకు భారీగా ఆస్తులు ఉన్నాయని రూ. 7 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని తెలిపింది. కానీ న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని వాటిని పరిష్కరించుకునేందుకు డబ్బులు కావాలని నమ్మించింది.

Advertisement

 

అంతా నిజమేనని నమ్మిన బాధితుడు రెండేళ్లలో విడతల వారీగా రూ. 46 లక్షలు పంపించాడు. అనంతరం ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళను అరెస్టు చేశారు. నిందితురాలి నుంచి ఐదు చరవానులు ఒక ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు శ్వేతా సులభంగా డబ్బు సంపాదించడానికి ఫేస్బుక్ లో రిక్వెస్ట్ లు పెట్టి యువకులకు వల విసురుతున్నట్టు పోలీసులు గుర్తించారు.

Read Also : IPL 2023 : బాల్‌ కొనడానికి డబ్బుల్లేవ్‌.. కట్‌ చేస్తే ధోనీ టీంలోకి ఎంట్రీ..

 

Visitors Are Also Reading