అనసూయ ఈ భామ గురించి తెలియని వారు ఉండరు. బుల్లితెర షోలో యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది ఈ భామ. యాంకర్ గా పలు షోలు, కార్యక్రమాల్లో పాల్గొన్న అనసూయ సినిమాల్లో వరుసగా అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ చేరువలో ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అంతేకాకుండా వరుస ఫోటోషూట్లు, రీల్స్, హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది అనసూయ. అనసూయ అంటేనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో అభిమానులు చేసే కామెంట్లపై ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా అనసూయ ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో కాస్త కాంట్రవర్సీగా మారిపోయింది. కొత్త సంవత్సరం ఎంట్రీతోనే ట్రోలర్స్ బారినపడింది అనసూయ. న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్క సెలబ్రిటీలు తమ అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ వీడియోలను పోస్ట్ చేశారు.
Advertisement
అలానే అనసూయ కూడా ఓ వీడియోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇన్ స్టాలో తెగ పాపులర్ అయినటువంటి సావేజ్ అక్కయ్య ఒరిజినల్ ఆడియోను వాడింది. ఆ ఆడియోలో అక్కయ్య తన జోలికి వస్తే దూల తీర్చి దూపం వేస్తా అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇదే వాయిస్ ని అనసూయ రీల్ గా వాడటంతో ఇప్పుడు ఆ వీడియో మళ్లీ వైరల్ గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ట్రోలర్స్ మళ్లీ అనసూయను టార్గెట్ చేస్తూ ఆ వీడియో కింద తనకు ఇష్టంలేని పదాన్ని వాడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో మళ్లీ అనసూయ రచ్చ మొదలైంది. ఇక ఈ కామెంట్లపై అనసూయ ఎలా స్పందిస్తుందో, వారికి ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!